పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ జిల్లాలో (In Murshidabad district )ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.ఈ ఘటనల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత పాత్ర ఉందని కలకత్తా హైకోర్టు నియమించిన విచారణ కమిటీ తాజాగా వెల్లడించింది.ఈ ఘటనలు వక్ఫ్ సవరణ బిల్లుతో సంబంధమున్న సమయంలో జరగడం గమనార్హం. నివేదిక ప్రకారం, ప్రధానంగా హిందువులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.బాధితులు సహాయం కోసం ప్రయత్నించినా, స్థానిక పోలీసులు స్పందించలేకపోయారు.హైకోర్టు (High Court) ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కొన్ని కీలకమైన విషయాలను బయటపెట్టింది. TMC కౌన్సిలర్ మెహబూబ్ ఆలం ఈ దాడుల ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు.ఆయన నేతృత్వంలో గుంపులు గ్రామంలోకి చొచ్చుకువచ్చి ధ్వంసం సృష్టించారని నివేదికలో ఉంది.“మెహబూబ్ ఆలం గుండాలతో కలిసి ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడి ప్రజలపై దాడి చేసి, ఆస్తిని నాశనం చేశారు.

పోలీసులు ఎక్కడా కనిపించలేదు. వారు బాధితులను వదిలిపెట్టారు,” అని కమిటీ పేర్కొంది.ఈ దాడులు ఏప్రిల్ 11న మధ్యాహ్నం 2:30 తర్వాత మొదలయ్యాయి. (Murshidabad Violence) అనేక ఇళ్లను తగలబెట్టారు, దుకాణాలు ధ్వంసం చేశారు.బెట్బోనా గ్రామంలోనే 113 ఇళ్లు తీవ్రంగా నష్టపోయాయి.నివేదిక ప్రకారం, ఈ దాడులు పథకపూర్వకంగా జరిగాయి. బాధితులు ప్రాణాల కోసం పరుగులు తీశారు. కానీ పోలీసులు కాలక్షేపం చేసి వచ్చారు. ఈ వ్యవహారం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొనబడింది.ఈ విచారణ కమిటీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర న్యాయ సేవల సంస్థ సభ్యులు ఉన్నారు.
వారు సంఘటన ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు.ప్రతి పాయింట్ ఆధారాలతో సహా నివేదిక రూపుదిద్దుకుంది.ఈ నివేదికను ఇవాళ కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్కు సమర్పించారు.దానికి అనుగుణంగా హైకోర్టు త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.విచారణ కమిటీ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి.ఇది కేవలం ఊహాజనితంగా కాకుండా, నేరుగా స్థానికుల వాదనలు, ఫోటోలు, వీడియో ఆధారాల ఆధారంగా రూపొందించారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. కానీ ఈ నివేదిక వెలుగులోకి రాగానే, రాజకీయంగా వేడి పెరుగనుంది. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Also : India-Pak: భారత్-పాక్ యుద్ధంలో చైనా గెలిచిందా?