హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త! ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో టికెట్ ధరలను 10% తగ్గిస్తూ, హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైలు (METRO RAIL)యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు మే 24, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులపై భారం (Burden on passengers)తగ్గించడమే కాకుండా, మెట్రో సేవలను మరింత మంది వినియోగించే అవకాశం ఉంది .

తగ్గింపు మే 24 నుంచి అమల్లోకి..
ప్రస్తుతం, మెట్రో టికెట్ ధరలు దూరం ఆధారంగా రూ.10 నుండి రూ.75 వరకు ఉన్నాయి. 10% తగ్గింపు తర్వాత, ఈ ధరలు సుమారు రూ.9 నుండి రూ.68 వరకు ఉంటాయి. ఇది ప్రయాణికులకు సుమారు రూ.1 నుండి రూ.7 వరకు ఆదా చేసే అవకాశం కల్పిస్తుంది. ఈ తగ్గింపు మే 24, 2025 నుంచి అమల్లోకి రానుంది. ప్రయాణికులు ఈ తేదీ నుంచి తగ్గిన ధరలతో మెట్రో సేవలను వినియోగించవచ్చు.
వారం రోజుల క్రితం మెట్రో ఛార్జీలను పెంచుతూ హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ పెంచిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న టికెట్ ధరకు కనిష్ఠంగా రూ.10 నుంచి రూ.12, గరిష్ఠ టికెట్ ధర రూ.60 నుంచి రూ.75గా సవరించారు. ఈ ఛార్జీలను కిలోమీటర్ల వారీగా పెంచారు. మెట్రో ఛార్జీలు పెంచిన దగ్గరి నుంచి ప్రయాణికులు, విపక్షాల నుంచి ధరలను తగ్గించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది.
Read Also : Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం: ఎఫ్ఐఆర్ నమోదు