ఈ రోజుల్లో ఏ విషయం తెలుసుకోవాలన్నా మనం గూగుల్ను ఆశ్రయించడం సహజమే. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ (Google Chrome browser) చాలామందికి మూడింట్లో రెండు సార్లు ఉపయోగపడుతుంది. కానీ, క్రొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన హెచ్చరిక ఒక్కసారిగా టెన్షన్కి గురిచేసే వార్త.ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, గూగుల్ క్రోమ్లో భారీ భద్రతా లోపాలు ఉన్నాయి. ఈ బగ్స్ను వాడుకుంటూ హ్యాకర్లు, (Hackers) మన వ్యక్తిగత డేటాను దోచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పాత వెర్షన్ వాడితే ప్రమాదం గ్యారంటీ!
మీరు విండోస్ వాడుతుంటే, 136.0.7103.114 కంటే పాత క్రోమ్ వెర్షన్ మీ కంప్యూటర్లో ఉందా? అయితే మీరు టార్గెట్ అయ్యే అవకాశం ఎక్కువ. అలాగే, మ్యాక్ లేదా లైనక్స్ వినియోగదారులైతే 136.0.7103.113 కంటే పాత వెర్షన్లు సేఫ్ కాదు అని స్పష్టంగా పేర్కొన్నారు.
ఇంత ప్రమాదం ఎందుకంటే..?
ఈ ప్రమాదానికి కారణమైన రెండు ప్రధాన బగ్స్ ను గుర్తించారు. వాటిలో మొదటిది CVE-2025-4664. ఇది క్రోమ్ లోడర్ వ్యవస్థలో లోపం కలిగించేది. దీనివల్ల ఒక స్పెషల్ వెబ్సైట్ ద్వారా హ్యాకర్లు మీ డేటాను యాక్సెస్ చేయగలరు.ఇంకోటి CVE-2025-4609, ఇది మోజో కంపోనెంట్ లో ఉన్న బగ్. ఇది సిస్టమ్కి హ్యాకర్ ప్రవేశానికి గేటు లా మారుతుంది.
అయితే డేటా ఎలా కాపాడుకోవాలి?
సాధారణమైన అప్డేట్తోనే ఈ ముప్పును నివారించవచ్చు. (Google Chrome) బ్రౌజర్ను తాజా వెర్షన్కు అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం:
ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
పై కుడివైపున ఉండే మూడుచుక్కలు (Menu) పై క్లిక్ చేయండి.
అందులో Help అనే ఆప్షన్ ఎంచుకోండి.
తర్వాత About Google Chrome పై క్లిక్ చేయండి.ఇప్పుడు క్రోమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మీ బ్రౌజర్ రీస్టార్ట్ కావొచ్చు, కానీ తర్వాత మీరు సేఫ్!
ఎందుకు ఈ చర్య తప్పనిసరి?
ఇప్పుడు డిజిటల్ ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, పాస్వర్డ్స్ అన్నీ హ్యాకర్ల లక్ష్యంగా మారిన ఈ కాలంలో, చిన్న అప్డేట్ మనల్ని పెద్ద ముప్పు నుంచి కాపాడుతుంది.మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే ఒక్కసారి మీ వెర్షన్ని చెక్ చేయండి. పాత వెర్షన్ అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి. డేటా సురక్షితంగా ఉండాలంటే, ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో బిగ్ లాస్ నుంచి కాపాడతాయి.
Read Also : Telugu Desam Party : జర్మనీలో మినీ మహానాడు పోస్టర్ ఆవిష్కరించిన నేతలు