అరుణాచల్ప్రదేశ్లోని కొన్నిప్రాంతాలకు చైనా తమ పేర్లు పెట్టడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇది వృథా, అహంకారపూరిత చర్యగా అభివర్ణించింది. అరుణాచల్ప్రదేశ్(Arunachal Pradesh)లో కొన్నిప్రాంతాలకు చైనా(China) పేర్లు పెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందన్న భారత్, అది వృథా ప్రయత్నమని పేర్కొంది. అలాంటి ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించే తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

భారత్ నుంచి విడదీయలేని అంతర్భాగం: జైస్వాల్
పేర్లు పెట్టడం ద్వారా తిరస్కరించలేదని వాస్తవాలను మార్చలేరని చైనాకు గట్టిగా చురకలు అంటించింది భారత్. అరుణాచల్ప్రదేశ్ ఎప్పటికీ భారత్ నుంచి విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir జైస్వాల్) స్పష్టం చేశారు. పేర్లు మార్చినా వాస్తవాలు మారవని తెలిపారు.
అరుణాచల్ప్రదేశ్లోని అనేక ప్రాంతాల పేర్లు మార్చి తరచూ మ్యాప్లను విడుదల చేయడం చైనాకు పరిపాటిగా మారింది. అది తమ భూభాగమే అని చాలా ఏళ్లుగా చైనా అంటూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో సాంస్కృతిక పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, ఆ చర్యల్లో భాగంగానే అక్కడి ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతున్నామని డ్రాగన్ కొంతకాలంగా వాదిస్తోంది.
6 ప్రాంతాలకు కొత్త పేర్లు
ఇప్పటికే అనేక సార్లు జాబితాలను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని 6 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మొదటి జాబితాను 2017లో చైనా పౌర వ్యవహారాల శాఖ రిలీజ్ చేసింది. ఆ తర్వాత 2021లో 15, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మరో రెండు లిస్టులను డ్రాగన్ విడుదల చేసింది. 2024లో కూడా అరుణాచల్ప్రదేశ్లోని 30 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లతో జాబితాను తీసుకొచ్చింది.\
‘అరుణాచల్లోని ఆ 30 ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలి. చైనా సార్వభౌమాధికార హక్కులకు క్లెయిమ్ చేసుకునే ప్రదేశాల పేర్లను విదేశీ భాషలలో పిలవకూడదు. వాటి పేర్లను విదేశీ భాషల నుంచి చైనీస్లోకి అనువదించకూడదు’ అంటూ అప్పట్లో స్టేట్మెంట్ ఇవ్వగా, భారత్ తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేయగా, నిరాధార వాదనలు వల్లె వేస్తే వాస్తవాలు మారవని స్ఫష్టం చేసింది భారత్.
Read Also : Donald Trump : సౌదీ అరేబియా పర్యటనలో ట్రంప్