हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Andhra Pradesh: కూతురు రెండో పెళ్లి కోసం మనవరాలిని చంపిన అమ్మమ్మ

Sharanya
Andhra Pradesh: కూతురు రెండో పెళ్లి కోసం మనవరాలిని చంపిన అమ్మమ్మ

పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన శైలజ అనే యువతి రెండు సంవత్సరాల క్రితం తాను ప్రేమించిన వ్యక్తి సతీష్ ను కులాంతర వివాహం చేసుకుంది. ఈ పెళ్లి శైలజ తల్లికి ఇష్టంలేకపోయినా, శైలజ తన ఇష్టానుసారం జీవితం ప్రారంభించింది. ఈ దంపతులకు యశ్విత అనే కుమార్తె జన్మించింది. అయితే సతీష్‌తో మధ్యలో విభేదాలు రావడంతో శైలజ, బిడ్డను తీసుకుని తన పుట్టింటికి తిరిగి వెళ్లింది. అక్కడ నుంచి కథకు కొత్త మలుపు మొదలైంది. మొదట కూతురితో విరక్తంగా ఉన్న శైలజ తల్లి నెమ్మదిగా శైలజ మనసు మార్చింది. శైలజను తమ కులంలోనే మరొక యువకుడితో పెళ్లి చేయాలనే ఆలోచనతో ఆమెను ప్రభావితం చేసింది. అయితే ఈ రెండో పెళ్లికి యశ్విత అడ్డుగానే నిలుస్తుందని భావించి, తల్లీకూతుళ్లు కలిసే పసికందును హత్య చేయాలని కుట్ర పన్నారు.

ఘోర హత్య:

మే 6న రాత్రి ఈ పథకం అమలు చేశారు. రెండవ వివాహానికి బిడ్డ అడ్డంగా ఉద్దేశంతో బిడ్డను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు. ఈ నెల 6న పసికందు యశ్విత గొంతు నులిమి హత్య చేశారు. ఆపై పక్కింట్లోని బావిలో పడేశారు. గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి తన బిడ్డను చంపేశారని శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులను నమ్మించేందుకు ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు జరిగినట్లు తల్లీకూతుళ్లు సీన్ సృష్టించారు.

పోలీసులు దర్యాప్తు

అయితే తల్లీకూతుళ్ల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో, పోలీసులు తమదైన శైలిలో విచారించగా తాము చేసిన ఘోరాన్ని వారు బయటపెట్టారు. రెండో పెళ్లికి అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో తామే పసిబిడ్డను హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు.

Read also: Road Accident: పల్నాడు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870