భారత–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల (India – Pakistan War) నేపథ్యంలో పాకిస్తాన్కు చైనా ఆయుధాలు (Chinese weapons to Pakistan) సరఫరా చేస్తోందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వ్యాపించాయి. ముఖ్యంగా చైనా Y-20 మిలిటరీ కార్గో విమానం ద్వారా భారీగా ఆయుధాలను పాక్కు పంపించారన్న ప్రచారం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలను చైనా అధికారికంగా ఖండించింది.
చైనా మిలటరీ అధికారిక ప్రకటన
చైనా మిలటరీ తన అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, పాక్కు ఆయుధాల సరఫరా జరగలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా చైనాపై అవాస్తవ ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ, అలాంటి తప్పుడు సమాచారం పంచిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారత్తో ఉన్న సంబంధాల్లో చైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది.
అదంతా ఫేక్ ప్రచారం
అయితే వాస్తవంగా పాకిస్తాన్ తన ఆయుధ అవసరాల్లో మూడొంతులను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో పలు యుద్ధ సామగ్రిని, యుద్ధ విమానాలను చైనా పాకిస్తాన్కు అందించింది. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండానే వదంతులుగా మారాయని చైనా స్పష్టం చేసింది. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇలాంటి వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also : Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ విజయం.. బీజేపీ తిరంగా యాత్ర