టీమిండియా టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ గుడ్బై చెప్పినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది, అలాగే భావోద్వేగాల్లో ముంచేసింది. కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తూ, “ఇది ఒక అద్భుత ప్రయాణం. భారత టెస్ట్ క్రికెట్ ఆడటం నా జీవిత గర్వకారణం. ఇప్పుడు ఈ అధ్యాయానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని నమ్ముతున్నాను,” అంటూ హృదయాన్ని తాకే మాటలు చెప్పారు.

కోహ్లీ టెస్ట్ కెరీర్
విరాట్ కోహ్లీ భారత్ తరఫున దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్ తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు. తన కెరీర్లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు.
కెప్టెన్గా కోహ్లీ
విరాట్ కోహ్లీ భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా కూడా అనేక విజయాలను అందించారు. ఆస్ట్రేలియాలో భారత తొలి టెస్ట్ సిరీస్ గెలుపు ఆయన నాయకత్వంలోనే సాధ్యపడింది. మొత్తం 68 టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించి 40 విజయాలు సాధించడం విశేషం. భారత జట్టును ఫిట్నెస్ పరంగా, పోరాట శక్తి పరంగా తిరుగులేని స్థాయికి తీసుకెళ్లారు. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది.
రోహిత్ శర్మ, కోహ్లీ – ఒకే తరంలో వీడ్కోలు
ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించడం తెలిసిందే. రోహిత్ రిటైర్ మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.
Read also: Ricky Ponting : ఆస్ట్రేలియా వెళ్లాలని మళ్లీ మనసు మార్చుకున్న పాంటింగ్