భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ, ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అచ్చం సినిమాల్లోలాగానే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ ద్వారా “కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది” అని ప్రకటించేశారు. ప్రపంచం అంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా ఈ వ్యవహారంలో తలపెట్టినట్టు కనిపించలేదు.అసలు కథ ఏంటంటే… భారత దళాలు ముమ్మర దాడులు చేస్తుండగా, పాకిస్థాన్ నుంచి ఒక ఆశ్చర్యకర ప్రతిపాదన వచ్చింది. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో, పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా హాట్లైన్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ను సంప్రదించారు. ముఖ్యంగా కాల్పుల విరమణపై చర్చించారని సమాచారం.ఈ సమయంలో, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో మాట్లాడినట్టు సమాచారం ఉంది.
అంటే, ఈ ప్రతిపాదన పాక్ సైనిక అధికారి స్థాయిలో వచ్చిందన్నది స్పష్టమవుతుంది.లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసినప్పటికీ, ప్రత్యుత్తర చర్యలపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. అంతేకాదు, ఉదయం 10:50 గంటలకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశం నిర్వహించినప్పటికీ, ఈ ప్రతిపాదనపై ఏమీ ప్రస్తావించలేదు. ఆయన కేవలం భారత వైమానిక దళం దాడుల వివరాల్ని మాత్రమే వెల్లడించారు.ఆ సమయంలోనే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు మరింత ఉద్ధృతం చేసింది. పాకిస్థాన్కు కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైంది. ఇది పాక్ను గట్టిగా కొట్టిన షాక్. దాంతో, పాకిస్థాన్ నుంచి తక్షణమే విరమణ ప్రతిపాదన వచ్చింది.మరోవైపు, జైశంకర్ – రూబియో ఫోన్ సంభాషణ జరిగిన తరువాత, జైశంకర్ ట్విట్టర్లో “భారత్ ఎప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది” అని పేర్కొన్నారు.
కానీ అప్పటి పరిస్థితుల్ని బట్టి చూస్తే, భారత్ ఇప్పటికీ దాడుల పంథాలోనే ఉంది.అంతలోనే, ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత భద్రతా సమావేశం జరిగింది. అందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్, ముగ్గురు సర్వీసు చీఫ్లు, రా-ఐబీ అధిపతులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఒకే మాట చెప్పారు – “భారత్ చేతిలో ఉన్న ఆధిక్యతను వినియోగించాలి.ఈ ఆధిక్యతకు కారణాలు కూడా ఉన్నాయి. బలగాల ధైర్యం, ఆధునిక ఆయుధాలు, మెరుగైన ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ మద్దతు – ఇవన్నీ భారత్కు అనుకూలంగా ఉన్నాయి.ఇదిలా ఉండగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి, పాక్ అణు ప్రణాళికలపై కీలక సమాచారం ఇచ్చినట్టు సీఎన్ఎన్ నివేదిక పేర్కొంది. కానీ ఇది పూర్తి నిజం కాదు అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, ఆ సమాచారం వచ్చిన తర్వాత కూడా భారత్ దాడులను ఆపలేదు.ఆఖరికి, పాకిస్థాన్ అణ్వాయుధాలపై సమావేశం ఏర్పాటు చేసి… మళ్లీ రద్దు చేసుకోవడం కూడా భారత్ పట్టుదలకే సంకేతం. భారత్ వెనక్కి తగ్గలేదని ఇది చెబుతుంది.ఇప్పటి వరకు ప్రధానులు మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రేపు (మే 12) డీజీఎంఓల హాట్లైన్ చర్చల తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
Read Also : Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్టు విమానాలు రద్దు : ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం