పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సింధు నదీ జలాలు పాకిస్థాన్కు వెళ్లేలా ఉన్న ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ చర్యల ద్వారా ఆ నీటిని దేశంలోని అవసరాలకే వినియోగించేందుకు భారత్ యోచిస్తోంది. అందులో భాగంగా సింధు జలాలను దేశంలోని నాలుగు రాష్ట్రాలకు మళ్లించనున్నట్లు సమాచారం.
ఈ నాలుగు రాష్ట్రాలకూ లబ్ది
ఈ నాలుగు రాష్ట్రాలు రాజస్థాన్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ సింధు జలాల లబ్ధిదారులుగా మారనున్నాయి. ఈ రాష్ట్రాల్లో సాగునీటి అవసరాలు, తాగునీటి వినియోగం, పరిశ్రమల అవసరాల కోసం ఈ జలాలను వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్రం ముందుకు వెళుతోంది. పాక్పై నీటి ఆధిపత్యం సాధించే దిశగా ఇది కీలకమైన అడుగుగా పరిగణించబడుతోంది.
జలాల మళ్లింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలు
ఇక ఈ జలాల మళ్లింపునకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే పని మొదలుపెట్టింది. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపట్టి, నీటి ప్రవాహ మార్గాలను మారుస్తూ, కొత్త కాలువలు, బ్యారేజీలు నిర్మించే పనులు వేగవంతంగా జరగనున్నాయి. దీనివల్ల పాకిస్థాన్కు ఒకింత ఒత్తిడి పెరగనుండగా, భారత్ నీటి పరంగా తమ హక్కును వినియోగించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
Read Also : India – Pakistan War : దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్