हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Operation Sindoor: పాక్ యుద్ధం వేళ రాజస్థాన్‌, పంజాబ్‌లలో హై అలర్ట్

Sharanya
Operation Sindoor: పాక్ యుద్ధం వేళ రాజస్థాన్‌, పంజాబ్‌లలో హై అలర్ట్

పహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం స్పందనగా చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” విజయవంతంగా పూర్తయ్యింది. ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సాయుధ దళాలు క్షిపణి దాడులు జరిపాయి. దీని ప్రభావం పాక్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్‌లపై(High alert in Punjab, Rajasthan) పడింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు హై అలర్ట్ పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు.

Operation Sindoor
Operation Sindoor

రాజస్థాన్‌లో అప్రమత్తత

పాకిస్థాన్‌తో రాజస్థాన్‌ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీనిని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే స్పాట్‌లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉంది. ఫైటర్‌ జెట్స్‌ ప్రొటోకాల్‌ నేపథ్యంలో జోధ్‌పూర్‌, కిషన్‌గఢ్‌, బికనీర్‌లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు. సరిహద్దుల్లో యాంటీ డ్రోన్‌ వ్యవస్థతో పాటు క్షిపణి రక్షణ వ్యవస్థలను యాక్టివేట్‌ చేశారు. గంగానగర్‌ నుంచి రాణా ఆఫ్ కచ్‌ వరకు సుఖోయ్-30 ఎంకేఐ జెట్‌లు ఎయిర్ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి.

సైనిక చర్యలతో పాటు విద్యా, రవాణా రంగాలపై ప్రభావం

ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్‌, శ్రీ గంగానగర్, జైసల్మేర్‌, బర్మేర్‌ జిల్లాల్లో పాఠ‌శాల‌ల‌ను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవులు రద్దు చేశారు. అలాగే సరిహద్దు గ్రామాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్‌, జోధ్‌పూర్‌లో అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తిగా లైట్లను ఆర్పివేయాలని ప్రకటించారు. దీనివల్ల శత్రుదేశం వైమానిక దాడులు చేయడానికి కష్టమవుతుంది.

పంజాబ్‌లో భద్రతా చర్యలు

పంజాబ్(Punjab) రాష్ట్రం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. పోలీసుల సెలవులు రద్దు, బహిరంగ సభలపై ఆంక్షలు, ప్రజల గుమికూడడాన్ని నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది పంజాబ్‌లో 2016 ఉరి దాడుల తర్వాత తీసుకున్న అత్యంత గంభీర భద్రతా చర్యలుగా భావించవచ్చు. కాగా, బుధ‌వారం భార‌త బ‌ల‌గాలు నిర్వ‌హించిన క్షిప‌ణి దాడుల‌ను ‘బాధ్యతాయుత దాడులు’గా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. “ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం, ఇండియాకు పంపబడే ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంపైనే మేము దృష్టి సారించాం” అని ఆయన అన్నారు. అయితే, భారత క్షిపణి దాడులను ‘యుద్ధ చర్య’గా అభివర్ణించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘తగిన సమాధానం’ ఇచ్చే హక్కు తమ దేశానికి ఉందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనా, దాని దుష్పరిణామాలపై పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read also: Operation Sindoor: పాక్ సరిహద్దు గ్రామాల ప్రజల ఆవేదన అంతా ఇంతా కాదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

📢 For Advertisement Booking: 98481 12870