జమ్మూకశ్మీర్లో పహల్గామ్ వద్ద అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు బాధ్యులుగా నిర్ధారించబడ్డాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారీ దాడికి తెగబడింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్) తో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. దీనిపై భారతీయులు అందరూ హర్షం వ్యక్తం చేశారు.
సెలెబ్రిటీల ప్రశంసలు
భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, తారక్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు. వారి పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్ వైరల్
తాజాగా ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ పాక్ ఉగ్రవాదులపై సెటైరికల్ కామెంట్ చేశారు. “పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఓ మహిళ భర్తని చంపి… ‘మోదీకి చెప్పు’ అని వెళ్లారు. ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోదీకి చెప్పింది,” అంటూ ఎక్స్ (ట్విట్టర్) లో వర్మ చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది.
Read also: Operation Sindhur: “ఆపరేషన్ సింధూర్” పై సినీ ప్రముఖుల స్పందన