భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణను, కాబోయే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ “ప్రజల ప్రధాన న్యాయమూర్తి”గా అభివర్ణించారు. జస్టిస్ రమణ సామాన్యులకు న్యాయాన్ని చేరువ చేయడంలో చేసిన విశేష కృషిని, ఆయన దార్శనికతను కొనియాడుతూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.బుధవారం న్యూఢిల్లీలోని ఢిల్లీ హైకోర్టు ఆడిటోరియంలో జరిగిన ‘నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ – ఏ జడ్జ్ స్పీక్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పుస్తకం జస్టిస్ ఎన్వీ రమణ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాల సంకలనంగా రూపొందింది.జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, “ప్రజల వద్దకు వెళ్లాలని, వారితో మమేకం కావాలని విశ్వసించిన వ్యక్తి జస్టిస్ రమణ. ఆయన నిజంగా ప్రజల భారత ప్రధాన న్యాయమూర్తి అని నేను భావిస్తున్నాను,” అని పేర్కొన్నారు. అంతేకాక, జస్టిస్ రమణ తన పదవిలో ఉన్నప్పుడు తొమ్మిది మంది న్యాయమూర్తులు ఒకేసారి సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రాత్మక ఘట్టమని గుర్తు చేశారు.

జస్టిస్ గవాయ్, జస్టిస్ రమణ, మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మధ్య మూడు ఉమ్మడి అంశాలు ఉన్నాయని తెలిపారు:
మూడు మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు.
మూడు మంది వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు.
మూడు మంది తొలితరం న్యాయవాదులుగా ఉన్నారు.
జస్టిస్ రమణను “ప్రజా స్నేహితుడు”గా అభివర్ణిస్తూ, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ రమణ నిత్యం సమాజ శ్రేయస్సు గురించే ఆలోచించేవారని తెలిపారు.జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ కేవలం వివాదాలను పరిష్కరించే సంస్థ మాత్రమే కాదని, అది రాజ్యాంగ నైతికతకు ప్రతీక అని, సామాన్యుడికి మిగిలిన చివరి ఆశాకిరణాల్లో ఒకటని అన్నారు. తాను సీజేఐగా ఉన్న సమయంలో న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం, కోర్టు విచారణ ప్రక్రియలో భారతీయ భాషలను భాగం చేయడం, ప్రజలకు నాణ్యమైన న్యాయ సహాయం అందేలా చూడటం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.ఈ పుస్తకం న్యాయ సిద్ధాంతాలపై వ్యాఖ్యానం కాదని, విద్యార్థి నాయకుడిగా, కార్మిక సంఘ కార్యకర్తగా, పాత్రికేయుడిగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తాను పొందిన అనుభవాల నుంచి రూపుదిద్దుకున్న ఆలోచనల సమాహారమని ఆయన వివరించారు.ఈ కార్యక్రమానికి పలువురు.
Read Also : Indian Army : రాత్రి నుంచి పాక్ బలగాల కాల్పులు: ఇండియన్ ఆర్మీ