Bharat : సరిహద్దుల్లో నేడు యుద్ధ విన్యాసాలు: భారత్ సైనిక సన్నద్ధత ఉద్ధృతం
కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడికి భారత ప్రభుత్వం కఠినంగా స్పందిస్తోంది. దేశం యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నదనే సంకేతాల మధ్య, పౌరుల్ని మాక్ డ్రిల్స్ ద్వారా యుద్ధ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా భారీ వ్యాప్తిలో మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది.ఇంతలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు పాకిస్తాన్ సరిహద్దులో భారత వాయుసేన భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహించనుంది. ముఖ్యంగా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ విన్యాసాలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సుమారు ఐదున్నర గంటలపాటు సాగే అవకాశం ఉంది. ఈ సమయంలో సరిహద్దులకు సమీపంలోని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం.వాయుసేన యుద్ధ విమానాల విన్యాసాలకు సంబంధించి ఎయిర్మెన్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రెండు రోజుల్లో రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం గమనార్హం. దీనితో భారత్ పాకిస్తాన్పై సైనిక చర్యలు ముమ్మరం చేయనున్నదనే ఊహాగానాలు బలపడుతున్నాయి.
Bharat : సరిహద్దుల్లో భారత్ యుద్ధ విన్యాసాలు ప్రారంభం
ఈ చర్యల నేపథ్యంలో దేశంలోని దాదాపు 300 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్కి బలగాలు సిద్ధమయ్యాయి. ఇకపోతే పాకిస్తాన్ కూడా భారత్ దాడికి సంబంధించి నిఘా సమాచారం ఆధారంగా తమ పౌరుల్ని ముందుగానే అప్రమత్తం చేస్తోంది. వాయుసేన విన్యాసాల్లో రాఫెల్ వంటి ఆధునిక యుద్ధ విమానాలు, ఎలైట్ పైలట్లు పాల్గొననున్నారు. దీనికి “ఆక్రమన్” అనే కోడ్ పేరు కూడా పెట్టారు.గత నెల (ఏప్రిల్ 25న) భారత్ ఇప్పటికే పెద్ద ఎత్తున విన్యాసాలు చేపట్టింది. ఇప్పుడు మరింత ఉగ్రంగా, రాజస్థాన్ సరిహద్దు వెంబడి భారత వాయుసేన తన శక్తిని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ఇది భారత్ సైనిక సిద్ధతను ప్రపంచానికి చాటిచెప్పే చర్యగా నిలవనుంది. యుద్ధ పరిస్థితులలో తక్షణ స్పందన, ప్రజల భద్రత, దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాలను పరీక్షించేందుకు ఇది కీలక మోమెంటుగా భావిస్తున్నారు.
Read More : RTC: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తాత్కాలిక వాయిదా