Sandhya Convention : సంధ్య కన్వెన్షన్పై హైడ్రా ధాటికి నేలమట్టం
సైబరాబాద్లోని గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా అధికారులు కఠిన చర్యలకు దిగారు. వివాదాస్పదంగా నిలిచిన సంధ్య కన్వెన్షన్ మినీహాల్తోపాటు అనుమతుల్లేకుండా నిర్మించిన నిర్మాణాలను మంగళవారం ఉదయం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండలం సర్వే నెంబర్లు 124, 125లో ఉన్న ప్లాట్లను ఆక్రమించి నిర్మించిన ఈ నిర్మాణాలపై పలువురు ప్లాటు యజమానులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు.ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లేఅవుట్లో మొత్తం 162 ప్లాట్లుండగా, ఓ వ్యక్తి భారీ ఎత్తున ‘సంధ్య కన్వెన్షన్’ నిర్మాణాన్ని చేపట్టాడు. లేఅవుట్కు సంబంధించిన హద్దులు, రోడ్లు, పార్కులను కూడా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలున్నాయి.
Sandhya Convention : గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ కూల్చివేత: హైడ్రా ధాటికి కలకలం
ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో మినీహాల్తోపాటు ప్రధాన హాల్కు ఆనుకొని ఉన్న వంటగదులు, పది రెస్ట్రూములు, రెండు అంతస్తుల ఐరన్ పిల్లర్లతో నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. లేఅవుట్ చుట్టూ వేసిన ఫెన్సింగ్ను కూడా తొలగించారు. అంతేకాకుండా, సంధ్య కన్వెన్షన్ పేరుతో ఏర్పాటు చేసిన బోర్డును కూడా తొలగించారు.ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు హైడ్రా అధికులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం ఈ ఘటనలో విశేషంగా నిలిచింది. నగరంలో అనధికారిక నిర్మాణాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. ప్రజల హక్కులను కాపాడేందుకు ఈ తరహా చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Read More : Gali Janardhan Reddy: ఎట్టకేలకు గాలి జనార్ధన్ రెడ్డి కి 7 ఏళ్ల జైలు శిక్ష