हिन्दी | Epaper
బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Pakistani Family: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ఉత్తరప్రదేశ్‌లో బయటపడిన భారీ పాకిస్తానీ కుటుంబం

Uday Kumar


పాకిస్తానీ కుటుంబం

మావోయిస్టు ల ఏరివేతకు చేపట్టిన కగార్ ఆపరేషన్ కర్రేకోటల దగ్గరికి వచ్చేటప్పటికీ చతికలబడినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు దూసుకువెళ్ళిన కగార్ ఆపరేషన్‌లో ఉన్నటువంటి సైనికులు కావచ్చు, డిఆర్జి పోలీసులు కావచ్చు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు తర్వాత ఎస్పీఎఫ్ దలాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం చూస్తే కేవలం పరిశోధనలకే పరిమితమయ్యే కానీ ఇటువంటి ఫలితాలు అయితే కనిపించట్లేదు. మొన్నటి వరకు కాంకర్ జిల్లాలో కావచ్చు, అంబూజమ దగ్గర కావచ్చు వేరే ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని ఇతర అటవీ ప్రాంతంలో తను కగార్ ఆపరేషన్‌ను విజృంభించి తీసుకెళ్లి సుమారుగా 200 నుంచి 300 మంది మావోయిస్టులను పొట్టన పెట్టుకోవడమే కాకుండా సుమారు వేలాది మంది మావోయిస్టులు అరెస్టులకి తర్వాత లొంగుబాటలకి అవకాశం ఇచ్చిన కగార్ ఆపరేషన్ ప్రస్తుతం కర్రేగుట్టల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు.

కర్రేగుట్టల వద్ద స్తబ్దత

ముందుగా 6000 మందితో మొదలైన కర్రేగుట్టల ఆపరేషన్ నెమ్మదిగా సిబ్బంది పెరుగుతూ వచ్చారు. ప్రస్తుతం మనం చూసుకుంటే అధికారిక లెక్కల ప్రకారం 24,000 మంది పోలీసులు కర్రేగుట్టలను చుట్టుముట్టారు. కానీ అక్కడ ఆశించిన మేరకు ఫలితం కనిపించట్లేదు. బెటాలియన్ ఇంచార్జ్ ఎవరైతే ఉన్నారో హిడ్మా కోసం పోలీసు దళాలు గాలింపు జరగడం మొదలు పెడుతున్నాయి. గెరిల్లా పోరాటంలో అత్యంత ప్రతిభాశాలి అయినటువంటి హెడ్మాన్‌ని పట్టుకోవడం అంత సులువు కాదని చెప్పేసి ముందు నుంచి చెప్తున్నారు. అదే ప్రస్తుతం మనం చూస్తే వాస్తవంగానే అర్థమవుతుంది. పోలీసుల అంది సమాచారం ప్రకారం కర్రేగుట్టల పైన సుమారుగా 3000 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని అందులో సుమారుగా 12 నుంచి 14 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని చెప్పేసి పోలీసు సమాచారం అందింది. దీంతో కేంద్ర బలగాలన్నీ కూడా కర్రేగుట్టల మీద దృష్టి సారించాయి.

గుట్టల్లోని వ్యూహాత్మక స్వరంగాలు

సుమారుగా 30 నుంచి 40 వరకు కర్రేగుట్టల్లో గుట్టల ప్రాంతం ఉంటుంది. అందులో చాలా వరకు స్వరంగాలు ఉంటాయి. ఈ స్వరంగాలు సుమారుగా 20 నుంచి 40 వరకు ఉంటాయని చెప్పేసి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ గుహలు ఏవైతే ఉన్నాయో ఏమాత్రం కనిపించకుండా ఆ చెట్లతోటి ముళ్లపొదలతోటి నిండి ఉంటాయి. అందులో ఎవరున్నారో కటిక చీకటిగా ఉంటుంది. దగ్గరికి పోయి చూస్తే గన లోపల ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం పోలీసులను చూస్తే ఇలాంటి గుహలను రెండు మూడు మాత్రమే కనిపెట్టగలిగారు. అందులో కొంత మేరకు ఆయుధ సామాగ్రి ఆహార ధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ అసలైన కీలకమైన ప్రాంతాలు మాత్రం వీళ్ళు వెళ్లలేకపోయారు. ఇప్పటి వరకు చూస్తే గత 10 రోజులుగా కర్రేగుట్టల చుట్టూ జరుగుతున్న ఆపరేషన్ గన మనం పరిశీలిస్తే ముగ్గురు మహిళా మావోయిస్టులు మినహా అంతకుమించి ఏ ఫలితం అయితే సాధించలేకపోయారు.

అత్యాధునిక సాంకేతికత, పరిమిత ఫలితం

గతంతో పోలిస్తే సైనిక దళాలు కావచ్చు, డిఆర్జి దళాలు కావచ్చు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు కావచ్చు ఎస్పీఎఫ్ దళాలు కావచ్చు ఇవన్నీ కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి దూసుకువెళ్తున్నాయి. ఒక పక్క ధర్మల్ ఇమేజెస్ అర్ధరాత్రి సమయంలో కూడా ఎదుటి శత్రువులు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడ పొంచి ఉన్నారన్న విషయాన్ని సైనికులు గతంలో బార్డర్‌లో ఉపయోగించేవారు అలాంటి లేటెస్ట్ టెక్నాలజీని కర్రేగుట్టల పైన ఉపయోగిస్తున్నారు. మరో పక్క హెలికాప్టర్లు అత్యాధునకమైన డ్రోన్లు అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధ సంపత్తితో సాయి దళాలు దూసుకువెళ్తున్నాయి. ఇప్పటివరకు సుమారుగా మూడు రెండు గుట్టల దాకా పూర్తిగా స్వాధీనం చేసుకొని అక్కడ జెండాలు ఎగరవేశారు. అంతకుమించి ఆశించిన ఫలితాలు అయితే మనకు కనిపించట్లేదు. ఇంకా సుమారుగా 20 నుంచి 25 గుట్టల వరకు ఉన్నాయి వాటిని చేరే పరిస్థితులు కనిపించట్లేదు.

మావోయిస్టుల హెచ్చరికలు, భౌగోళిక సవాళ్లు

ముందుగా మావోయిస్టులను మట్టుబెట్టడానికి వచ్చిన సాయి దళాలని మావోయిస్టులు ఒక హెచ్చరిక చేశారు. కర్రేగుట్టల దగ్గరికి వస్తే మైన్స్ ఉంటాయి. ఆ మైన్స్ వల్ల ఎంతమందినా సరే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఆదివాసులు చెప్తూ ఆదివాసులు ఎవరు కూడా గుట్టలోకి రావద్దని వాళ్ళకి సంకేతం ఇవ్వడం ద్వారా పరోక్షంగా పోలీసు బలగాలకి కేంద్ర బలగాలకి హెచ్చరికలు జారీ చేసి దాంతో ప్రతి అడుగు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. కర్రేగుట్టల పరిస్థితి చూస్తే సుమారుగా 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాంట్లో సగం వరకు తెలంగాణ, మహారాష్ట్ర లో విస్తరించి ఉంటాయి. మరి కొంత భాగం ఛత్తీస్‌గఢ్‌లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సాయి దళాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి ఎక్కువగా దూసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

మావోయిస్టుల వ్యూహాత్మక ఉపసంహరణ?

ఎప్పుడైతే మావోయిస్టు దళాలకి పోలీసుల నుంచి ఆటంకం మొదలైందో మావోయిస్టులు మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి సానుభూతిపరులతో శాంతి చర్చలకు రావాలని చెప్పేసి పిలుపులు ఇవ్వడం జరిగింది. ఇదంతా చూస్తే మావోయిస్టుల పని అయిపోయింది కాబట్టి వీళ్ళని ఉపయోగిస్తున్నారని చెప్పేసి అందరూ భావించారు కానీ అక్కడ పరిస్థితులు చూస్తే అది వేరే విధంగా ఉంది. మావోయిస్టులు ఎప్పుడో ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి జారుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారని తెలంగాణ ప్రాంతం కానీ లేదంటే మహారాష్ట్ర ప్రాంతం కానీ వెళ్లిపోయి సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందుగా ఊహించినట్టుగా 3000 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నారా అసలు కేంద్ర పాలకులు అక్కడ ఉన్నారా అన్న దాని మీద కగార్ ఆపరేషన్ చూస్తుంటే చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి.

వాతావరణం, భౌగోళిక పరిస్థితుల ప్రభావం

ప్రధానంగా మనం చూసుకుంటే కర్రేగుట్టల దగ్గర పరిస్థితులు వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడి పరిస్థితులకి అక్కడి పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటలకే అక్కడ చీకటి పడుతుంది. ఐదు గంటలు అయిన తర్వాత ముందు ఎవరున్నారో కూడా కనిపించని పరిస్థితి. ఇక్కడ థర్మల్ ఇమేజ్ కెమెరాలు తప్ప వేరే ఏమి పని చేయదు. పోలీసులు కూడా ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి. దాంతో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసిన రాత్రి విశ్రాంతి తీసుకోవడం తప్ప వేరే ఆపరేషన్‌ని కొనసాగించలేని పరిస్థితి. సరే ఉదయం పూట ఆపరేషన్‌ని చురుగ్గా చేద్దాం అని చెప్తే విపరీతమైన ఎండ. ఈ ఎండ చాలా గుట్టల దగ్గర ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దీనితోటి సుమారుగా 40 నుంచి 70 మంది ఆ సైనిక దళాలు, సైనిక బలగాల్లో ఉన్నటువంటి సైనికులు డీహైడ్రేషన్‌కు గురై అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. వీళ్ళని హెలికాప్టర్‌లో ఎప్పటికప్పుడు సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్‌కి ఛత్తీస్‌గఢ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్న విధానం ప్రస్తుతం మనకి ఛత్తీస్‌గఢ్ కగార్ ఆపరేషన్‌లో కనిపిస్తుంది.

సక్సెస్ పై నీలినీడలు

దీంతో కగార్ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అన్నది ఇప్పటికి కూడా మనకు అనుమానమే. అసలు ఆ గుట్టల పైన మావోయిస్టులు ఉన్నారా లేరా అన్నది కూడా స్పష్టమైన సమాచారం అందడం లేదు. దీంతో ఈ కగార్ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా గనంగా మారింది. ఇక్కడ మనం కొన్ని లోపాలు జరిగాయని మనం భావించొచ్చు. ప్రధానంగా చూసుకుంటే సైనిక దళాలు మావోయిస్టుల గాలింపులో ప్రత్యేకతలు అర్థం చేసుకోలేని పరిస్థితి అక్కడ ఉంటుంది. ఎందుకంటే సరిహద్దు దళాల్లో సరిహద్దు ప్రాంతాల్లో పోరాటం వేరు, లోపల అంతర్గత భాగంగా ఉన్నటువంటి మావోయిస్టులని గాలించడం ఒక ఎత్తుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక వ్యూహం అన్నది సక్రమంగా ఉండదు. ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరైతే గిరిజనులు గాని స్థానికులు గాని స్థానిక పోలీసులు వాళ్ళతోటి సమాచారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించాల్సి వస్తుంది. తే భద్రతా ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసినటువంటి భద్రతా దళాలు మావోయిస్టులను గుర్తించే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం లేరని మనకు అర్థమవుతుంది. వీళ్ళు కేవలం ఎవరితో కూడా సంబంధం లేకుండా ఒక సైనిక బలగాలు ముందుకు వెళ్ళినట్టుగా ముందుకు వెళ్తున్నారు అంతేగానీ ఒక వ్యూహం ప్రకారం వెళ్లడం లేదు.

మావోయిస్టుల వ్యూహాత్మక ఉపసంహరణ, పోలీసుల ప్రయత్నాలు

ఎప్పుడైతే ఒక పక్కన నుండి అంటే ఛత్తీస్‌గఢ్ పై నుంచి కర్రేగుట్టల దగ్గరికి వస్తున్నారో మావోయిస్టులు ఇటువైపు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర చిత్రావతి నది వైపు కావచ్చు అటువైపు నుంచి తప్పించుకునే అవకాశం కనిపించింది. అయితే ఇప్పటికి కూడా కేంద్ర పాలకులు అక్కడే ఉన్నట్లుగా ప్రకటన రిలీజ్ చేస్తున్నారు. సంఘశతకు రావాలని చెప్తున్నారు. వాళ్ళ కాల్పులని విరమించాలని చెప్పేసి కోరుతున్నారు. దీని ద్వారా ఒక మావోయిస్టులు ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా సమాచారం అందుతున్నప్పటికీ వాస్తవాన్ని చూసుకుంటే పోలీసులు ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నారు. మావోయిస్టులు మాత్రం సురక్షితంగా అక్కడి నుంచి తప్పించుకొని వేరే ప్రాంతాలకి వెళ్లిపోయారు. గెరిల్లా పోరాటంలో ప్రధానంగా చెప్పుకునేది ఇదే. ఎప్పుడైతే శత్రువు బలంగా ఉంటాడో అప్పుడు వెనక్కి అడుగు వేయాలి. ఎప్పుడైతే శత్రువు ఏమరపాటుగా ఉంటాడో ఆ సమయంలో దెబ్బ తీయాలన్నదే గెరిల్లా పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ గెరిల్లా పోరాటంలో హెడ్మా దగ్గర నుంచి సెంట్రీ మావోయిస్టు వరకు పూర్తిగా శిక్షణ పొంది ఉంటారు. ఎలా తప్పించుకోవాలి, ఎలా పారిపోవాలి, ఎలా దాడి చేయాలి అనే అనేక అంశాలపై వాళ్ళకి శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగించుకొని మావోయిస్టులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు.

భారీ బలగాలు, లక్ష్యం నెరవేరుతుందా?

అయితే ఈ సైనిక బలగాలు ఎంతవరకు వెళ్తాయి ఎంతవరకు విజయం సాధిస్తాయి కర్రేగుట్టలు స్వాధీనం చేసుకుంటాయా ఇప్పటికి ఐదు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. బేస్ క్యాంపులు అంటే సైనిక బలగాలు శాశ్వతంగా అక్కడే ఉంటారు. షిఫ్ట్‌ల ద్వారా మారుతూ ఉంటారు. దీనివల్ల 6000 నుంచి ప్రారంభమైన సైనిక బలగాలు ప్రస్తుతం 24,000కు చేరుకున్నాయి. ఇంకా మరింత సంఖ్య పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకాడటం లేదు. ఏ విధంగా అయినా సరే మావోయిస్టు లేని ప్రాంతంగా ఛత్తీస్‌గఢ్‌ని తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపు మేరకు సైనిక బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ ఆపరేషన్ చూస్తుంటే ఇప్పటికైతే కర్రేగుట్టల దగ్గర అయితే ఆపరేషన్ కగార్ చతికల పడినట్లయితే అర్థం చేసుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్
1:49

ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్

క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్
0:25

క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్

ఐఎండీబీ 2025 పాపుల‌ర్  తారల జాబితా విడుదల
1:05

ఐఎండీబీ 2025 పాపుల‌ర్  తారల జాబితా విడుదల

పాతబస్తీ ఆటోలో యువకులు మృతి: డ్రగ్స్ ఒవర్‌డోస్ అనుమానం
0:57

పాతబస్తీ ఆటోలో యువకులు మృతి: డ్రగ్స్ ఒవర్‌డోస్ అనుమానం

అఖండ-2 నుంచి హైందవం సాంగ్ రిలీజ్
3:07

అఖండ-2 నుంచి హైందవం సాంగ్ రిలీజ్

కరిచే వ్యక్తులు పార్లమెంట్ లోపల ఉన్నారు.. ఎంపీ రేణుకా చౌదరి
0:31

కరిచే వ్యక్తులు పార్లమెంట్ లోపల ఉన్నారు.. ఎంపీ రేణుకా చౌదరి

అంబులెన్సు పైకి దూసుకొచ్చిన ఏనుగు
0:57

అంబులెన్సు పైకి దూసుకొచ్చిన ఏనుగు

విలేజ్ కుకింగ్ ఛానల్ కు 3 కోట్లు సబ్స్కెబర్లు
8:16

విలేజ్ కుకింగ్ ఛానల్ కు 3 కోట్లు సబ్స్కెబర్లు

రోహిత్, గంభీర్ మధ్య లాంగ్ డిస్కషన్
0:36

రోహిత్, గంభీర్ మధ్య లాంగ్ డిస్కషన్

బస్సులో సీటుకోసం ప్రయాణికున్ని కొట్టిన మహిళ
0:22

బస్సులో సీటుకోసం ప్రయాణికున్ని కొట్టిన మహిళ

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: బర్త్‌డే వేడుకలో నలుగురు మృతి
1:00

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: బర్త్‌డే వేడుకలో నలుగురు మృతి

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదల
0:34

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదల

📢 For Advertisement Booking: 98481 12870