हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

NEET 2025 : నీట్ పరీక్షలో కఠినంగా బయాలజీ ప్రశ్నలు

Digital
NEET 2025 : నీట్ పరీక్షలో కఠినంగా బయాలజీ ప్రశ్నలు

NEET 2025 పరీక్షలో కఠినమైన బయాలజీ ప్రశ్నలు – ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి నిరాకరణ, కరీంనగర్ ఘటన కలకలం

ఈ సంవత్సరం జరిగిన NEET 2025 పరీక్ష విద్యార్థులకు సవాలుతో కూడినదిగా మారింది. ముఖ్యంగా బయాలజీ ప్రశ్నలు గతేడాదితో పోలిస్తే కఠినంగా ఉండటంతో పరీక్ష రాసిన విద్యార్థులంతా ఒకే స్వరంతో ఇది కాస్త కష్టంగా ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలూ సులభంగా లేవని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా సుమారు 22.7 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేయగా, తెలంగాణలో 72,507 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవగా, గేట్లు 1:30 గంటలకే మూసివేశారు.ఈ సమయంలో కొన్ని మానవీయ ఘటనలు కన్నీటి కధలుగా మారాయి. కరీంనగర్ లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వద్ద ఒక విద్యార్థిని మరియు ఆమె తల్లి 3 నిమిషాల ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చారు. నిబంధనల ప్రకారం అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థిని తల్లి అక్కడే అధికారులకు కాళ్లు మొక్కింది. కూతురి కోచింగ్ కోసం బంగారం అమ్మిన తల్లి కన్నీటి పర్యంతమవుతూ కూతురి డాక్టర్ కల నెరవేరాలని వేడుకుంది. అయినప్పటికీ అధికారులు నిబంధనలని అడ్డుపెట్టుకొని అనుమతించలేదు.ఇలాంటిదే సంఘటన సికింద్రాబాద్ వైఎంసిఏ లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చోటుచేసుకుంది. ఒక బాలిక నిమిషం ఆలస్యంగా చేరగా, గేట్లు మూసి ఉండటంతో ఆమెను లోపలికి అనుమతించలేదు. బాలిక తీవ్ర నిరాశతో వెనుదిరిగింది.ఒకవైపు కఠిన ప్రశ్నాపత్రం, మరోవైపు కఠిన నిబంధనలు పలువురు విద్యార్థులపై మానసిక భారం కలిగించాయి. అయితే రాచకొండ పోలీసుల జోక్యంతో ఒక అభ్యర్థిని తప్పుగా వెళ్లిన పరీక్షా కేంద్రం నుంచి సరైన కేంద్రానికి సకాలంలో చేర్చారు.

 NEET 2025 : నీట్ పరీక్షలో కఠినంగా బయాలజీ ప్రశ్నలు
NEET 2025 : నీట్ పరీక్షలో కఠినంగా బయాలజీ ప్రశ్నలు

NEET 2025 పరీక్షలో కఠినమైన ప్రశ్నలు

ఇది కొంత ఊరటనిచ్చిన విషయం.ఈ పరీక్ష పద్ధతులు, నిబంధనల కఠినతపై తల్లిదండ్రులు, విద్యార్థులు, సామాజికవేత్తలు చర్చ ప్రారంభించారు. ఒక నిమిషం ఆలస్యం వల్ల విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడుతున్న దృశ్యాలు మనల్ని మనస్ఫూర్తిగా ఆలోచించాల్సిన పరిస్థితికి నెట్టేస్తున్నాయి. NEET వంటి జాతీయస్థాయి పరీక్షల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే అయినా మానవీయ కోణంలో కొంత సడలింపునివ్వాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ పరీక్షాల నిర్వహణలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.ఇలాంటి విషాదకర ఘటనలు విద్యా వ్యవస్థలో మరింత మానవతా దృక్పథాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Read More : Tragedy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870