భారత్ తన శత్రువులపై కఠినంగా స్పందిస్తోంది.కానీ పాకిస్థాన్ మాత్రం పాత వైఖరిలోనే ఉంది.ప్రతిసారీ కవ్వింపులతో ముందుకు వస్తోంది.ఏప్రిల్ 22న పహల్గాం లో భయానక దృశ్యం చోటుచేసుకుంది.పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతుల సంఖ్య చూసి దేశం దిగ్భ్రాంతి చెందింది.ఈ దాడికి పాకిస్థాన్ జైషే మొహమ్మద్ మద్దతు అందించిందని సమాచారం.ఈ దాడి తర్వాత భారత్ వద్ద బలమైన ఆధారాలు వచ్చాయి.వాటితో పాకిస్థాన్పై భారత్ దూకుడు పెంచింది.ఉగ్రవాదులకు శిక్షించేందుకు భారత్ వెంటనే చర్యలు తీసుకుంది.పాకిస్థాన్ నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది.
పాక్పై ఆంక్షలు – సంబంధాలకు తెర
భారత్ కొన్ని దఫాల్లో ఆంక్షలు విధించింది.ఆర్థికంగా, వ్యాపారంగా పాక్ను సంబంధాలన్నీ పూర్తిగా కట్ చేసింది.ఇక పాకిస్థాన్ వస్తువులు భారత్కి రావడమే లేదు.ఇవన్నీ జరిగినా, పాక్ తన తీరు మార్చలేదు.దేశ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.శనివారం అర్ధరాత్రి కూడా కాల్పులకు దిగింది.కుప్వారా, బారాముల్లా, రాజోరి, పూంచ్, అక్నూర్ ప్రాంతాల్లో పాక్ జరిపిన కాల్పులు ఉద్రిక్తత కలిగించాయి.
భారత్ బదులిచ్చింది – ధీటుగా ఎదుర్కొంది
భారత సైన్యం వెంటనే బలంగా స్పందించింది.ప్రతిగా తగిన విధంగా ఎదురుదాడికి దిగింది.ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు.అయినా అలజడి మాత్రం కొనసాగుతోంది.
పాక్ నిర్ణయం – భారత నౌకలకు నో అనుమతి
భారత్ దిగుమతులు నిలిపివేసిన కొద్ది గంటల్లోనే పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే నౌకలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించింది. ఇది వ్యాపార సంబంధాలను మరింత దెబ్బతీసింది.ఇన్ని చర్యల తర్వాత కూడా పాకిస్థాన్ మౌలికంగా మారడం లేదు. ఉగ్రవాదానికి మద్దతు, సరిహద్దుల్లో కవ్వింపులు ఆగడంలేదు. భారత్ ఎంత కఠినంగా వ్యవహరించినా, పాక్ తీరు అదే.పహల్గాం దాడి తర్వాత పరిస్థితులు స్పష్టంగా మారాయి. భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ పాక్ మాత్రం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. శాంతికి మార్గం ఉండాలంటే, పాక్ తన వైఖరిలో మార్పు తేవాలి.
Read Also : China : సీఐఏలో చైనీయుల నియామకానికి నోటిఫికేషన్