हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Sonia-Rahul : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు

Digital
Sonia-Rahul : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధించి నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) చార్జిషీట్ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నిందితులు వచ్చే విచారణ తేదైన మే 8న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.ఈడీ తన చార్జిషీటును 2025 ఏప్రిల్ 9న మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3 మరియు 4 కింద దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా గాంధీని ఏ1, రాహుల్ గాంధీని ఏ2 నిందితులుగా పేర్కొంది. అంతేకాక, కాంగ్రెస్ నేతలు సామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చింది. ఈ మొత్తం కేసు నేషనల్ హెరాల్డ్ అనే చారిత్రక వార్తాపత్రికకు సంబంధించినది. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన ఈ పత్రికకు చెందిన ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) ద్వారా చాలా తక్కువ ధరకు కాంగ్రెస్ నేతలు స్వాధీనం చేసుకున్నారని ఈడీ ఆరోపించింది.

 Sonia-Rahul : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు
Sonia-Rahul : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు

Sonia-Rahul : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు

ఈడీ ప్రకారం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.50 లక్షలకే యంగ్ ఇండియన్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ సంస్థలో సోనియా గాంధీకి 38 శాతం, రాహుల్ గాంధీకి 38 శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లు యంగ్ ఇండియన్‌కు బదిలీ చేయడం ద్వారా భారీ ఎత్తున ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అభియోగం.ఈ లావాదేవీ మనీలాండరింగ్‌కు సంబంధించినదిగా పేర్కొంటూ, ఇది పీఎంఎల్‌ఏ చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. విచారణకు ముందే ఈడీ ఆరోపణలు, కాంగ్రెస్ నాయకులపై న్యాయపరమైన చర్యల నేపథ్యంలో రాజకీయ వేడి పెరిగే అవకాశం ఉంది.

Read More : Bilawal Bhutto: ఉగ్రవాదులతో తమ సంబంధం నిజమే: బిలావల్ భుట్టో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870