हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Uttar Pradesh: గాళ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన కొడుకు..చితకబాదిన తల్లితండ్రులు.. వీడియో వైరల్

Sharanya
Uttar Pradesh: గాళ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన కొడుకు..చితకబాదిన తల్లితండ్రులు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో శుక్రవారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ కుటుంబాన్ని తలకిందులు చేసింది. తమ కుమారుడు ఓ యువతితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు, ఆ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డుమీదే అతనిపై మరియు అతని గాళ్‌ఫ్రెండ్‌పై దాడికి దిగారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఘటన వివరాలు:

ఈ సంఘటన కాన్పూర్ నగరంలోని గుజైనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌గోపాల్ కూడలి వద్ద చోటుచేసుకుంది. రోహిత్ అనే 21ఏళ్ల యువకుడు తన స్నేహితురాలు (19)తో కలిసి ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్ద చౌమీన్ (నూడుల్స్) తింటుండగా అతని తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ప్రేమ వ్యవహారం తమ మానసికంగా ఒప్పుకోవలేనిదని భావించిన తల్లి సుశీల, తండ్రి శివ్‌కరణ్ – ఇద్దరూ రోహిత్ మరియు అతని స్నేహితురాలిపై దాడికి దిగారు.

వీడియో వైరల్:

వైరల్ అయిన వీడియోలో రోహిత్ తల్లి సుశీల యువ జంటను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. వారు టూవీలర్‌పై తప్పించుకునే ప్రయత్నం చేయగా సుశీల యువతి జుట్టు పట్టుకుని లాగడం వీడియోలో రికార్డయింది. అక్కడున్న స్థానికులు, బాటసారులు వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, రోహిత్ తండ్రి శివ్‌కరణ్ తన కొడుకును చెప్పుతో కొట్టడం కూడా కనిపించింది.

స్పందించిన పోలీసులు:

వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఇరు పక్షాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, “ఇది కుటుంబ అంతర్గత వ్యవహారం. మేము ఇరు పక్షాలకూ కౌన్సెలింగ్ ఇచ్చాం. అయితే, బహిరంగ దాడి జరిగినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

Read also: Singer: సోనూ నిగమ్‌పై కన్నడిగుల ఆగ్రహం ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870