ఈ స్ఫూర్తిదాయక సంఘటన హర్యానాలోని కురుక్షేత్రలో చోటుచేసుకుంది. సమాజంలో వరకట్న వేధింపులు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఈ సంఘటన కొత్త దృక్పథాన్ని, మంచి దిశనూ ఇచ్చింది. వివాహం అనేది కుటుంబాల మధ్య ఒక పవిత్రమైన సంబరంగా, ప్రేమ, ఆప్యాయత మరియు సంస్కృతి పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచే సందర్భంగా ఉండాలని మనం క్రమంగా గుర్తించాలి. అలాంటి పరిస్థితే వికాస్ రాణా తన కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే
ఉత్తరప్రదేశ్, సహారన్పూర్ జిల్లాలోని భాబ్సి రాయ్పుర్ గ్రామానికి చెందిన వికాస్ రాణా వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన తండ్రి శ్రీపాల్ రాణా గతంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున యూపీలోని కైరానా లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. సంస్కరణ భావాలు కలిగిన వికాస్కు, హరియాణాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్తో వివాహం నిశ్చయమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం, ఏప్రిల్ 30న వికాస్ రాణా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కురుక్షేత్రకు చేరుకున్నారు. అక్కడి ఓ హోటల్లో వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు.
కట్నాన్ని నిరాకరించిన వరుడు
వివాహ వేడుకలో భాగంగా తిలకం కార్యక్రమం జరుగుతుండగా, వధువు తల్లిదండ్రులు వరుడు వికాస్ రాణాకు సంప్రదాయం ప్రకారం రూ. 31 లక్షల నగదును కట్నంగా అందజేశారు. అయితే, ఆ భారీ మొత్తాన్ని స్వీకరించేందుకు వికాస్ వినయంగా నిరాకరించారు. తమకు కాబోయే కోడలు అగ్రికా తన్వరే అసలైన కానుక అని, అంతకు మించిన కట్నం తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వరుడి అభీష్టం మేరకు, కేవలం ఒక రూపాయి నాణెం, కొబ్బరికాయతో సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతును పూర్తి చేశారు. వరకట్నం కోసం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వికాస్ రాణా తీసుకున్న ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇది సమాజానికి ఒక మంచి సందేశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై పలువురు ప్రజలు తమ అభినందనలను వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయ ప్రకారం, ఈ సంఘటన సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందచేసారు.
Read also: Madhya Pradesh: భార్యను హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టి.. చివరకు భర్త ఆత్మహత్య