हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Caste Census : కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

Sudheer
Caste Census : కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర కేబినెట్‌ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని అణగారిన వర్గాల హక్కులను పరిరక్షించేందుకు, వారికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు మరింత స్పష్టత వచ్చి సామాజిక న్యాయ సాధనలో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు.

రాహుల్ వల్లే కేంద్రం ఈ నిర్ణయం

రాహుల్ గాంధీ దార్శనికతకు కేంద్రం చర్య తీసుకున్నదనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటిగా కులగణనను ప్రారంభించిన రాష్ట్రమని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో ఈ చర్యలు ప్రారంభమయ్యాయని, ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం కేంద్రాన్ని ప్రభావితం చేయగలిగిందన్నదే ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.

Read Also : Caste Census : కాంగ్రెస్ కులగణనకు వ్యతిరేకి – బండి సంజయ్

కేంద్ర నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయం

ఈ నేపధ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పందిస్తూ, కేంద్ర నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలే తెలంగాణలో కులగణన సర్వేకు ప్రేరణగా మారాయని, ప్రజల్లో నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సాధారణ జనగణనతోపాటు కుల గణన కూడా సమాజ నిర్మాణంలో సమానత్వాన్ని స్థిరపరిచేందుకు ఉపయోగపడుతుందన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870