हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Amaravathi : 42 నియోజకవర్గాల రూపు రేఖలు మారబోతున్నాయి

Sudheer
Amaravathi : 42 నియోజకవర్గాల రూపు రేఖలు మారబోతున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలకు సూచించారు. అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణపై కూడా చంద్రబాబు మాట్లాడారు, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

రైతుల భూములతో రాజధాని నిర్మాణం

చంద్రబాబు పేర్కొన్నట్టు అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. వారి భూముల్లోనే రాజధాని నిర్మించేందుకు ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రైతులకు రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని, వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేస్తే యువతకు ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయని వివరించారు. అభివృద్ధిపై విమర్శలు చేసే శక్తులను ప్రజలు నమ్మకూడదని, ప్రభుత్వం చేస్తున్న మేలు పనులను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు.

పెరుగుతున్న పెట్టుబడులు, పరిశ్రమలు

చంద్రబాబు ప్రభుత్వానికొచ్చిన 10 నెలల లోపే పలువురు హామీలను నెరవేర్చామని తెలిపారు. పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్ మంజూరు, స్టీల్ ప్లాంటుకు భారీ పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు పునాది వేస్తామని చెప్పారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అలాగే రాయలసీమను డిఫెన్స్, ఆటో మొబైల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాయలసీమ లాజిస్టిక్స్ హబ్‌గా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

Read Also : Rajiv Yuva Vikasam Scheme : ఈ కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870