తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఈ నెల 30న ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు అయిదు లక్షల మంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదలకు ముందు, విద్యా శాఖ అధికారులు గ్రేడింగ్ విధానం, మార్కుల కంప్యూటరేషన్, మరియు పరిశీలన ప్రక్రియను పూర్తిచేశారు.

పదో తరగతి ఫలితాల మార్పులు:
ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసేందుకు నిర్ణయించారు. వాస్తవానికి పదో తరగతి మూల్యాంకనం, మార్కుల కంప్యూటరీకరణ, పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యా శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ ఆధీనంలోనే ఉంది. సీఎం విదేశీ పర్యటనతో ఆయన తుది ఆమోదం వరకు వేచి చూసారు. సీఎం ను కలిసిన అధికారులు ఫలితాల విడుదల పైన చర్చించారు. ఈ నెల 30న మల్లు భట్టి ఫలితాల విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. గతంలో, గ్రేడింగ్ విధానంలో విద్యార్థులకు జాతీయ లేదా రాష్ట్ర స్థాయి మార్కులు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సారి, ప్రతీ సబ్జెక్టులో గ్రేడింగ్ తో పాటుగా, విద్యార్థి మార్కులు మెమోలో పొందుపరచబడతాయి. ఇంటర్నర్, ఎక్స్ టర్నర్ మార్కులు జీపీఏ మెమోలో ఉండేలా నిర్ణయించారు. ఇప్పటి వరకు విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లు ఇచ్చారు. దీని వలన ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించటం కష్టం. ఇప్పుడు ఈ విధానం మార్పు చేయటంతో గ్రేడ్స్ తో పాటుగా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. ఈ సంవత్సరం 80 మార్కుల పరీక్ష మరియు 20 మార్కుల అంతర్గత పరీక్ష విధానంతో విద్యార్థులు తమ మార్కులను పొందుతారు. వచ్చే ఏడాది నుండి అంతర్గత మార్కులు ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు విద్యా శాఖ తెలిపింది.
ఫలితాలు ఆన్లైన్ లో:
విద్యార్థులు తమ ఫలితాలను తర్వాత అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లు bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు SMS ద్వారా క్షణాల్లో వస్తాయి. దీంతో, ఫలితాల ముహూర్తం ఖరారు కావటంతో విద్యార్ధుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
Read also: Fire Accident : యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం