Pahalgam : పీఓకేలో హమాస్ కదలికల తరువాత పహల్గాంలో ఉగ్రదాడిపీఓకేలో హమాస్ వచ్చాకే పహల్గాంలో ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఇజ్రాయెల్ రాయబారి రెవెన్ అజర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడికి, తాజాగా పహల్గాంలో జరిగిన దాడికి మధ్య స్పష్టమైన పోలికలు ఉన్నాయని ఆయన చెప్పారు. రెండు ఘటనల్లోనూ అమాయక పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు జరిపారని, ఉగ్రవాద గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతోందని రెవెన్ అజర్ హెచ్చరించారు.ఉగ్రవాద సంస్థలు పరస్పరం సహకరించుకోవడం కాకుండా, ఒకరికొకరు అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. హమాస్ నాయకులు ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో జైషే మహ్మద్ కార్యకర్తలతో సమావేశమైన సమాచారం ఉన్నందున, పహల్గాం దాడికి ఈ పరిణామాలకు సంబంధం ఉండొచ్చని రెవెన్ అజర్ అనుమానం వ్యక్తం చేశారు.

Pahalgam : పీఓకేలో హమాస్ నేతల కదలికలు – పహల్గాం దాడికి సంబంధం
పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై దాడి జరగగా, ఇజ్రాయెల్లో సంగీత వేడుక జరుపుకుంటున్న సమయంలో హమాస్ దాడులు జరిగాయని చెప్పారు. ఈ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన తీరును, ముఖ్యంగా బీహార్లోని మధుబని సభలో చేసిన ప్రసంగాన్ని రెవెన్ అజర్ ప్రశంసించారు. భారత ప్రభుత్వం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా, తీసుకున్న కఠిన చర్యలు కు ధైర్యం కలిపించాయని పేర్కొన్నారు.ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉందని రెవెన్ అజర్ స్పష్టం చేశారు. ఆయుధాలు, నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం రూపంలో మద్దతు ఇచ్చే దేశాలను ప్రపంచ దేశాలు కఠినంగా ఎదుర్కొనాలని సూచించారు. ఇదే సమయంలో, పహల్గాం ఉగ్రదాడి, పాకిస్థాన్ చర్యల గురించి భారత్ జీ20 దేశాలకు సమాచారం అందించిందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 దేశాల రాయబారులతో సమావేశమైన భారత్ కార్యదర్శి విక్రం మిస్త్రీ ఈ విషయాలను వివరించారు. భారత్ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న కఠిన విధానాన్ని కూడా ఈ సందర్భంగా వివరించారు.
Read More : Danish Kaneria: పాక్లో పహల్గాం బాధితుల పరిస్థితే నాది కూడా: డానిష్ కనేరియా