అమెరికాలో భారత విద్యార్థులకు ఊరట: వీసా రద్దుపై కోర్టు తీర్పు
వాషింగ్టన్, : అమెరికాలో ఉన్న భారత విద్యార్థులకు ఆశాజనకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసిన విద్యార్థి వీసాలను పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో అమెరికాలో ఉన్న 133 మంది విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు, తాత్కాలికంగా ఊరట పొందారు.అమెరికా ప్రభుత్వం SEVIS (Student and Exchange Visitor Information System) ను టెర్మినేట్ చేయడంతో విద్యార్థుల లీగల్ స్టేటస్ తుడిచిపెట్టబడింది. అయితే, affected విద్యార్థులు అమెరికా కోర్టును ఆశ్రయించగా, కోర్టు వారి వాదనను సమర్థించింది. ఈ కేసులో అధికంగా భారతీయ విద్యార్థులే ఉండటంతో, ఇది భారత్-అమెరికా విద్యా సంబంధాలపై ప్రభావం చూపనుంది.అమెరికా ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ విద్యార్థులు కొన్ని సందర్భాల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టికి వచ్చారని పేర్కొన్నారు. కానీ, నేరచరిత్ర లేకుండా చిన్న కారణాలతో వీసాలు రద్దు చేయడం అన్యాయమని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి సన్నని విషయాలను బేస్గా తీసుకొని, అమెరికా విదేశాంగ శాఖ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

America : వీసా రద్దుపై కోర్టు స్టే: విద్యార్థులకు ఊరట
ఈ చర్యలు “Catch and Revoke” అనే ప్రోగ్రామ్ కింద తీసుకుంటున్నారు. AI టూల్స్ ద్వారా విద్యార్థుల సోషల్ మీడియా, కమ్యూనికేషన్, బహిరంగ కార్యకలాపాలన్నింటిని అమెరికా అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్లో ఇప్పటివరకు దాదాపు 300 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వారిలో సగం మంది భారతీయులు, మిగిలినవారు చైనీస్, నేపాలీస్, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ విద్యార్థులు.అమెరికాలో “Optional Practical Training” (OPT) కింద ఉన్న విద్యార్థులకు ఇది భారీ షాక్. OPT లో ఉండే విద్యార్థులు 36 నెలలపాటు తాత్కాలికంగా ఉద్యోగం చేయగలుగుతారు. ఇది వారికే కాకుండా, హెచ్-1బి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికీ కీలకమైన అడుగు. అయితే ఈ స్టేటస్ రద్దవడం వల్ల వారి వర్క్ అండ్ స్టే భద్రతపై ముసురు కమ్ముతోంది.ఇప్పుడు కోర్టు జోక్యంతో ఈ విద్యార్థులు అమెరికాలో తాత్కాలిక న్యాయం పొందారు. కానీ దీర్ఘకాలిక పరిష్కారం కోసం అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో పారదర్శకత, స్పష్టత అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా అమెరికా అధికారులతో మాట్లాడి విద్యార్థుల హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాలనే డిమాండు ఎక్కువవుతోంది.
Read More : India : పాకిస్థాన్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసిన భారత్