పహల్గాం దాడిపై భారత్ దూకుడు చర్యలు: పాక్పై ఒత్తిడి పెంచే దిశగా ముందడుగు
న్యూఢిల్లీ, : దక్షిణ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి పాకిస్తాన్లోని ఉగ్రవాద గ్రూపులకు ఉన్న మద్దతును వివరిస్తూ, ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం ప్రారంభించింది.ఈ క్రమంలో జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఖతర్ వంటి దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సౌత్ బ్లాక్లో జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పహల్గాం దాడి తీరును వివరించారు. ఉగ్రవాదానికి పాక్ అండ ఉందని స్పష్టంగా తెలిపారు.భారత ప్రభుత్వం చైనాతో సహా 20 దేశాల రాయబారులకు ఈ విషయాన్ని వివరించింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మిగిలేలా చేయాలన్నది ప్రధాన లక్ష్యం. సమావేశం సుమారు 30 నిమిషాలు కొనసాగి, భారత్కి మద్దతుగా నిలవాలని దేశాలను కోరింది.

పాక్ ఒంటరిగా మిగిలేలా చర్యలు – విదేశీ మద్దతు కోసం భారత్ ప్రయత్నం
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ హైకమిషన్కి చెందిన అత్యున్నత దౌత్యవేత్త సాద్ అహ్మద్కు పర్సన్ నాన్ గ్రాటా నోటీసు జారీ చేసింది. దీని ప్రకారం, ఆయన భారతదేశాన్ని వారం రోజులలోగా విడిచి వెళ్లాలి. ఈ చర్యలు పాకిస్తాన్పై తీవ్రమైన దౌత్య ఒత్తిడి సృష్టించేందుకు తీసుకున్న చర్యలుగా చూస్తున్నారు.ఈ విషయాన్ని బుధవారం జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశంలో చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాక్ రక్షణ, నావికా, వైమానిక దళాల సలహాదారులను కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.ఇదే క్రమంలో భారత ప్రభుత్వం, ఇస్లామాబాదులోని హైకమిషన్ నుంచి తన సైనిక సలహాదారులను వెనక్కి పిలుపునిచ్చింది. అట్టారి చెక్ పోస్టును తక్షణమే మూసివేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వీసా మీద భారత్లో ఉన్న పాకిస్తానీ పౌరులు 48 గంటలలోగా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది.భారతదేశం, సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని కూడా పాక్ పౌరులపై నిలిపివేసింది. అంతేకాకుండా, సింధు జల ఒప్పందాన్ని కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.ఈ చర్యలు పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచేలా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలు గణనీయంగా మారనున్నాయి.
Read More : Pahalgam Attack : ఇక పాకిస్థాన్ పౌరులకు నో వీసా