Terror Attack : జమ్మూలోని పహల్గాంలో దుర్మార్గంగా.. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టుల ఊహాచిత్రాలు దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్నేమ్లు కూడా ఉన్నట్లు పీటీఐ పేర్కొంది. వీరందరూ జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను తయారు చేశారు.

జమ్మూకశ్మీర్లో ఉగ్ర వేట
టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి వారి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో బాధితులు వారి ముఖాలను చూశారు. దీంతో జమ్మూకశ్మీర్లో ఉగ్ర వేట తీవ్రమైంది. దీంతోపాటు ఓ ఉగ్రవాది ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫొటోను కూడా విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో పహల్గాం దాడి మొదలైంది. ముష్కరులు బాడీ కెమెరాలతో దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీటిని హెల్మెట్లకు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. తొలుత బాధితులు అందరినీ ఉగ్రవాదులు ఒకచోటుకు చేర్చి వారి గుర్తింపులను తనిఖీ చేశారు.
కాశ్మీర్ లో పుల్వామా దాడి తర్వాత అత్యంత ఘోరమైన దాడి
అనంతరం హత్య చేశారు. కొందరిని స్నైపర్ వంటి టెక్నిక్స్ వాడి దూరం నుంచే కాల్చారు. 2019 లో పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. ఆరుగురు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారు జామున దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరి ఫొటో ఆన్ లైన్ కూడా కనిపించింది. ఈ ఫొటోలో ఉగ్రవాది AK47 రైఫిల్ పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా, తొలుత నిఘా వర్గాలు ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను అయితే ఆ తర్వాత ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేశారు.
Read Also: భారత్ ఉగ్రదాడిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటుంది : ఎంపీ ఈటల