हिन्दी | Epaper

Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడి.. తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

sumalatha chinthakayala
Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడి.. తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులనే టార్గెట్ చేస్తూ దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం హాస్పిటల్ కి తరలించారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్ రంజన్ కూడా ఉన్నారు. ఆయన భార్య సురక్షితంగా ఉండగా .. వారి పిల్లలు మాత్రం మృతి చెందారు.

 పహల్గామ్ ఉగ్రదాడి తెలంగాణ భవన్‌లో

ఏవైనా సమాచారం అందినట్లయితే వెంటనే, స్పందించేందుకు ఈ హెల్ప్‌లైన్

కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే స్పందించేందుకు, ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో తెలంగాణకు చెందిన మృతులను, గాయపడ్డవారని, గల్లంతైనవారిని కానీ, ఇంత వరకు ఎవ్వరూ గుర్తించలేదు. అయినప్పటికీ, ఏవైనా సమాచారం అందినట్లయితే వెంటనే, స్పందించేందుకు ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.

కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించి సమాచారం పొందవచ్చు:

శ్రీమతి వందన:9871999044.
శ్రీ హైదర్ అలీ నఖ్వీ: 9971387500.

ఈ ఘటనపై తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు జమ్మూ & కశ్మీర్ ప్రభుత్వం తో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పౌర సంబంధాల అధికారి,తెలంగాణ సమాచార కేంద్రం,న్యూ ఢిల్లీ చే జారీ చేయబడినది.

Read Also: ఉగ్రదాడిపై స్థానికులు ఏమంటున్నారంటే !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని సమర్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని సమర్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

📢 For Advertisement Booking: 98481 12870