हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Secretariat Staff : మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

Sudheer
Secretariat Staff : మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా జనరల్ కేటగిరీ సిబ్బందిపై కుదింపును పూర్తి చేసింది. మిగిలిన 11 కేటగిరీల సిబ్బందిపై కూడా రేషనలైజేషన్ మే మొదటి వారం నాటికి పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో తగిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తూ, జిల్లాల వారీగా తుది నివేదికలు సేకరిస్తున్నారు.

జనాభా ఆధారంగా ఉద్యోగుల పంపిణీ

ప్రభుత్వం నూతన విధానంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను జనాభా మేరకు సమంగా కేటాయించనుంది. ప్రతి సచివాలయం పరిధిలో ఉండే ప్రజల సంఖ్యను బట్టి 6 నుంచి 8 మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల అధిక సిబ్బంది ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉండటంతో ఈ రేషనలైజేషన్ ద్వారా సమతుల్యతను కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.

మే నెలలో బదిలీల ప్రక్రియ ప్రారంభం

రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మే నెలలో ఉద్యోగుల బదిలీలను చేపట్టనున్నారు. ఇందుకోసం సంబంధిత శాఖలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. బదిలీల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందించడంతోపాటు, ఉద్యోగుల అభ్యర్థనల ప్రకారం కొంత మేర సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బదిలీల ద్వారా ఉద్యోగుల సామర్థ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా, ప్రజలకు అందించే సేవల నాణ్యతను కూడా మెరుగుపరచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870