ప్రపంచాన్ని ఆకర్షించిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు ఉండరేమో. కానీ ఇప్పుడు ఆయన తల్లి మాయే మస్క్ భారత్ పర్యటనతో హాట్ టాపిక్గా మారిపోయారు. ప్రస్తుతం ఆమె ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా మాయే మస్క్ ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు.ఆమెతో పాటు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాయే మస్క్కు ఇది ప్రత్యేకమైన అనుభవంగా మిగిలిందని తెలుస్తోంది.ఈ సందర్శన సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేశారు. అందులో మాయేతో కలిసి ఆలయంలో ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆమె పోస్ట్లో ‘‘మాయే మస్క్తో కలిసి దైవ దర్శనం చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ తెలిపారు. ఈ ఫోటో కాస్త సమాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.ఇంతకీ మాయే మస్క్ ముంబైకి ఎందుకు వచ్చారు? దీనికి కూడా స్పష్టమైన సమాధానం ఉంది.

ఆమె రాసిన ప్రఖ్యాత పుస్తకం A Woman Makes A Plan హిందీకి అనువదించబడింది. దానిని అధికారికంగా ఆవిష్కరించేందుకు మాయే మస్క్ స్వయంగా భారత్కు విచ్చేశారు.మాయే మస్క్ ఈ పుస్తకంలో తన జీవితంలోని చేదు అనుభవాలు, కుటుంబంగా ఎదుర్కొన్న సమస్యలు, వ్యాపార మార్గంలో ఎదురైన అడ్డంకులు వంటి విషయాలను ఎంతో స్పష్టంగా వివరించారు. మహిళలు జీవితంలో ఎదురయ్యే వివిధ సవాళ్లకు ఎలా ఎదురుకావాలో, ఎలా విజయం సాధించాలో తన అనుభవాల ఆధారంగా పంచుకున్నారు.ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే… ఆమె ఇటీవల తన 77వ పుట్టినరోజు వేడుకలను కూడా ముంబైలోనే జరుపుకున్నారు. మాయే మస్క్ వయస్సు 77 ఏళ్లు అయినా, ఆమె ఉత్సాహం, జీవన శైలి చూస్తే అది ఎక్కడా కనిపించదు. ఆమె యాక్టివ్ మోడల్గా, రచయిత్రిగా, స్పీకర్గా తన కెరీర్ను కొనసాగిస్తున్నారు.మాయే మస్క్ ఆలయ దర్శనం, పుస్తక ఆవిష్కరణతో ఆమె పర్యటన భారత మీడియా దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె పట్ల అభిమానులు ప్రేమను వెల్లిపోస్తున్నారు. ఒక్కసారిగా ఈ విదేశీ ప్రముఖురాలు భారత్లో ప్రత్యేక ఆకర్షణగా మారారు.
Read Also : Maharashtra : మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు – రాజ్, ఉద్ధవ్ కలిసే అవకాశమా?