హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రగతినగర్లోని ఆదిత్య గార్డెన్స్ హరిత ఆర్కేడ్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న నంబూరి కృష్ణ పావని అనే గృహిణి తన నాలుగేళ్ల కుమార్తె జశ్వికకు విషం ఇచ్చి, తాను కూడా తాగిన విషాదకర ఘటన 18వ తేదీన సాయంత్రం చోటు చేసుకుంది.
ఘటన వివరాలు
ఈ ఘటనలో చిన్నారి జశ్విక (4) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తల్లి కృష్ణ పావని (32) ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంబశివ రావు అనే వ్యక్తి, తన భార్య కృష్ణ పావని, కుమార్తె జశ్వికతో కలిసి నివసిస్తున్నాడు. సంఘటన జరిగిన సమయంలో సాంబశివ రావు ఇంట్లో లేని సమయాన్ని కృష్ణ పావని, తమ కూతురు జశ్వికకు మజాలో ఎలుక మందు తాగించి ఆ తర్వాత తాను తాగింది . శనివారం తెల్లవారుజామున తన భర్తకు ఈ విషయాన్ని తెలపడంతో, అతను వెంటనే ఇంటికి వచ్చి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించాడు. బాచుపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, కృష్ణ పావని అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని తెలుస్తోంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు. అయితే, అంతిమంగా పూర్తి విచారణ తరువాతే అసలు కారణాలు స్పష్టమవుతాయి. చిన్నారి జశ్విక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆమెపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read also: Bhatti Vikramarka: హెచ్సీయూ విద్యార్థుల కేసుల తొలగింపుపై..భట్టి చెప్పినవి వట్టి మాటలేనా?