వేసవి కాలం వచ్చిందంటే మినరల్ లోటు, డీహైడ్రేషన్, చెమటలు, దాహం వంటి సాధారణ సమస్యలతో పాటు కొందరికి ఎదురయ్యే మరో సమస్య ముక్కు నుంచి రక్తం కారడం. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, పొడి చర్మం ఉన్నవారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే చాలా మంది దీన్ని చిన్నగా తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యల సంకేతంగా మారవచ్చు. అయితే, ఇలా ఎక్కువ రోజులు జరుగుతున్నా, రక్తస్రావం ఎక్కువగా అనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమస్యకు కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ముక్కు రక్తస్రావానికి ప్రధాన కారణాలు
అధిక వేడి, తేమ లోపం
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల గాలి పొడిగా మారుతుంది. ఇది ముక్కులోని నాజికాలు ఎండిపోవడానికి దారి తీస్తుంది. ఎండిపోయిన పొరలపై చిన్న పగుళ్లు ఏర్పడి రక్తస్రావం జరగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ముక్కును గోక్కుంటారు. దీనివల్ల నాజికాల్లో రక్తనాళాలు దెబ్బతిని రక్తం కారుతుంది.
డీహైడ్రేషన్
నీటి లోపం వల్ల శరీరంలో రసాయన సమతుల్యత తగ్గుతుంది. ముక్కులో తేమ తగ్గి పొరలు బలహీనపడతాయి. ఫలితంగా చిన్న గాయాలు కూడా రక్తస్రావానికి దారి తీస్తాయి.
వాతావరణ కాలుష్యం
ధూళి, పొగమంచు, పుప్పొడి గింజలు వంటివి ముక్కులోకి వెళ్లి అలెర్జీ లాంటి సమస్యలు కలిగించడంతో రక్తస్రావం జరుగుతుంది.
అలెర్జీలు, సైనసైటిస్
పలుకుబడి, వాసనలపై అలెర్జీలు ఉన్నవారిలో ముక్కులో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి రక్తస్రావం రావచ్చు. అలాగే సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.

రక్తస్రావం నివారణకు ఉపయోగపడే చిట్కాలు
నీరు తాగాలి
రోజూ కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం వల్ల ముక్కు పొరలు తేమగా ఉంటాయి.
కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, బటర్బట్టర్ వంటివి శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో సహాయపడతాయి. ఫార్మసీలో దొరికే సెలైన్ నాజల్ స్ప్రేను రోజుకు రెండు సార్లు ముక్కులో స్ప్రే చేయండి. ఇది ముక్కులో తేమను నిలుపుతుంది.
గదిలో తేమ స్థాయి పెంచండి
పొడి గాలిని తగ్గించేందుకు హ్యూమిడిఫయర్ వాడండి లేదా ఒక గిన్నె నీరు గదిలో ఉంచండి. ఇది గాలి తేమను పెంచుతుంది.
సహజ నూనెలు వాడండి
ముక్కులో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆముదం రాస్తే పొరలు తేమగా ఉండటంతో రక్తస్రావం తగ్గుతుంది.
మాస్క్ వాడకానికి అలవాటు పడండి
ధూళి, అలెర్జీకి కారణమయ్యే గింజల నుంచి రక్షణ కోసం బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి.
ఇంటిని శుభ్రంగా ఉంచండి
ఇంటిలో ధూళిని రోజూ తుడవడం ద్వారా పుప్పొడి అలెర్జీ సమస్య తగ్గుతుంది. ఇది రక్తస్రావాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. నారింజ, ముసంబి, జామ, లేమన్ వంటి పండ్లు విటమిన్ సి సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి రక్తనాళాలను బలపరుస్తాయి.
Read also: Ice juice: మితిమీరిన ఐస్ జ్యూస్..హానికరం