ఉత్తర అట్లాంటిక్ సమీపంలోని చిన్నతరహా ఫారో దీవులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప సమూహం, ఒక అరుదైన అంతరిక్ష శక్తి ప్రయోగాన్ని ప్రారంభించింది.ఇది భూమి మీద ఉండగానే చంద్రుడి శక్తిని వినియోగించాలన్న మహత్తర లక్ష్యంతో రూపొందించబడింది.ప్రపంచవ్యాప్తంగా చంద్రుని గురుత్వాకర్షణ వల్ల సముద్రాల్లో అలలు రావడం అందరికీ తెలిసిందే.కానీ ఆ అలలే విద్యుత్గా మారతాయంటే ఆశ్చర్యమే.ఫారో దీవులు ఇప్పుడు ఇదే దిశగా ముందడుగు వేస్తున్నాయి.ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థ SKF, సముద్ర శక్తి రంగంలో పనిచేస్తున్న Minesto సంస్థలతో కలసి ఓ వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి.ఈ ప్రాజెక్టులో కీలకంగా పనిచేస్తున్నది ‘లూనా’ (LUNA) అనే ఓ ప్రత్యేకమైన సముద్ర గాలిపటం. ఇది సముద్ర గర్భంలో తేలియాడుతూ అలల శక్తిని గ్రహిస్తుంది.

ఈ శక్తి చంద్రుడి ప్రభావంతో వచ్చే అలల ద్వారానే సేకరించబడుతుంది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, ఇది నిరంతరాయంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. లూనా ఒక్కటి 1.2 మెగావాట్ల శక్తిని తయారు చేయగలదు. ఇది సగటున 200 కుటుంబాల అవసరాలను తీరుస్తుంది. 2030 నాటికి ఈ ప్రాజెక్టు 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.అంటే ఫారో దీవుల మొత్తం ప్రజలకు 40 శాతం శక్తిని అందించగలదు. ఇది పూర్తిగా పర్యావరణహితమైన, స్వచ్ఛమైన విద్యుత్ శక్తి.
ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్న SKF సంస్థకు భారత్లోనూ కేంద్రం ఉంది.SKF ఇండియా డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ, అలల శక్తి భారత్ వంటి దేశాలకు గొప్ప ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ఎందుకంటే భారత్లోని విస్తారమైన తీర ప్రాంతాలు, ఈ శక్తి వినియోగానికి అనువుగా ఉంటాయని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో 80 శాతం శిలాజ ఇంధనాలదే మోజు. కానీ సముద్ర శక్తిని ఉపయోగిస్తే వాతావరణానికి హాని లేకుండా, స్వచ్ఛంగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఓషన్ ఎనర్జీ యూరప్ అంచనా ప్రకారం, 2050 నాటికి యూరప్ విద్యుత్లో 10 శాతం సముద్ర శక్తి నుంచే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే కాదు.ఈ రంగం లక్షలకొద్ది ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం కలిగిఉంది.