हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Acid Attack : కువైట్‌లో తెలుగు మహిళపై యాసిడ్ తో దాడి

Sudheer
Acid Attack : కువైట్‌లో తెలుగు మహిళపై యాసిడ్ తో దాడి

ఆర్థిక అవసరాల కోసం కువైట్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళపై యజమానులు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి, భర్త మరణంతో జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా చెందిన ఓ ఏజెంట్ ద్వారా రెండు నెలల క్రితం కువైట్‌కు వెళ్లింది. ఓ ఇంట్లో పని చేస్తే నెలకు 150 దీనార్లు వేతనం ఇస్తామని చెప్పగా, అక్కడ చేరిన తర్వాత కేవలం 100 దీనార్లు మాత్రమే ఇవ్వడం ప్రారంభించారు.

ప్రశ్నకు ప్రతిగా దాడి – ఆసుపత్రిలో చికిత్స

తన వేతనాన్ని తగ్గించిన విషయంపై యజమానులను ప్రశ్నించగానే లక్ష్మిపై వారు కిరాతకంగా యాసిడ్ పోసి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన పది రోజుల క్రితం జరిగినట్టు తెలుస్తోంది. కోలుకున్న తర్వాత ఆసుపత్రి సిబ్బందికి వివరాలు చెప్పిన లక్ష్మి ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించి, ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు.

woman suffers acid attack i
woman suffers acid attack i

పాస్‌పోర్టు అడ్డుకోవడం – ప్రభుత్వ స్పందనకు వేచి

లక్ష్మి తెలిపిన సమాచారం ప్రకారం, ఆమె పాస్‌పోర్టు యజమానుల వద్దే ఉండిపోయింది. కేసును వెనక్కి తీసుకుంటేనే దానిని ఇవ్వబోతున్నామని బెదిరిస్తున్నారట. దీంతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే చిక్కుకుని తీవ్ర మనోవేదనతో ఉంది. లక్ష్మిని అక్కడికి పంపిన ఏజెంట్‌ను సంప్రదించగా, తిరిగి పంపించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి లక్ష్మిని భారత్‌కు రప్పించాలని, న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870