కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం సామాన్యులపై భారం వేసింది పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల పెంపుతో ప్రజల జీవితం మరింత భారమైందని అన్నారు.ఈ విషయంపై కేటీఆర్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినా మనదేశంలో పెట్రోలు ధరలు మాత్రం తగ్గడం లేదని పేర్కొన్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నదన్నారు.పాకిస్థాన్ బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోలిస్తే, భారత్లో పెట్రోల్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు.

ఇది ఎంత దురదృష్టకరమో కేంద్రం గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఇంధనంపై కేంద్రం విధిస్తున్న సెస్సులు రాష్ట్రాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు.“మినిమమ్ గవర్నమెంట్, మ్యాక్సిమమ్ గవర్నెన్స్” అనే నినాదం కేవలం మాటలకే పరిమితమైందన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్నది “మ్యాక్సిమమ్ ట్యాక్సేషన్, మినిమమ్ రిలీఫ్” అని ఎద్దేవా చేశారు.
ప్రజలపై భారంగా మారిన ఈ సెస్సులు కేంద్రం తక్షణమే తొలగించాలన్నారు.ఈ పెట్రోల్ ధరల పెంపుతో ప్రజల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు.ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలపై ఈ ప్రభావం గణనీయంగా ఉంటుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తోందని విమర్శించారు.కేటీఆర్ అభిప్రాయం ప్రకారం, ఈ విధానం రాష్ట్రాలకు న్యాయం చేయడం లేదు. రాష్ట్రాలకు రావాల్సిన వాటా పూర్తిగా కట్ చేస్తుండటంతో అభివృద్ధి అడ్డుకుళ్లలో పడుతోంది. తెలంగాణ రాష్ట్రం దేశానికి అత్యధిక ఆదాయం అందించే రాష్ట్రాల్లో ఒకటే అన్నారు.అయినా కేంద్రం నిధుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం అప్రత్యక్షంగా పెత్తనం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు ఇది సరైన సమయం అని కేటీఆర్ స్పష్టం చేశారు.