మళ్లీ వార్తల్లో మంచు కుటుంబం: మనోజ్-విష్ణు మధ్య వాడీవేడి వివాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మోహన్బాబు కుటుంబం మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. గత కొన్ని నెలలుగా మూడుమూడు మాటలతో నడుస్తున్న కుటుంబ కలహాలు ఇప్పుడు పీక్కి చేరినట్లు కనిపిస్తోంది. తాజాగా నటుడు మంచు మనోజ్ తన కారు కనిపించకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఎలాంటి సాధారణ సమస్య కాదు అని మనోజ్ స్పష్టంగా చెబుతున్నారు. తన సోదరుడు మంచు విష్ణు దానికిప్పుడు బాధ్యతవహించాల్సిందిగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జల్పల్లిలోని మోహన్బాబు నివాసం ఎదుటకు వెళ్లి గేటు బయట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్, ఇది ఆస్తి గొడవ కాదని, తన పెంపుడు జంతువులు, వ్యక్తిగత వస్తువుల కోసం మాత్రమే అక్కడికి వెళ్లానని పేర్కొన్నారు.
మోహన్బాబు ఇంటి ఎదుట నిరసన తెలుపుతూ మంచు మనోజ్
ఈ ఉదయం జల్పల్లిలోని మోహన్బాబు నివాసానికి చేరుకున్న మనోజ్, ఇంటి గేట్ బైట బైఠాయించి నిరసన తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ఇది ఆస్తి గొడవ కాదని, తన వ్యక్తిగత భద్రతకు సంబంధించి విచారణ అని వ్యక్తం చేశారు. “నా జుట్టును విష్ణు చేతుల్లో పెట్టేందుకు ఇలా చేస్తున్నాడు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“ఇది ఆస్తి వివాదం కాదు… న్యాయం కోసమే నా పోరాటం”
మనోజ్ మాట్లాడుతూ, “ఇది ఆస్తి కోసం కాదు. నేను చాలా రోజుల క్రితమే ఈ ఆస్తిపై నా హక్కు లేదని తండ్రికి చెప్పా. కానీ ఇక్కడ నా పెంపుడు జంతువులు, వ్యక్తిగత వస్తువుల కోసం వచ్చాను,” అన్నారు. తనకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఎప్పుడూ అనుకోలేదని, డిసెంబర్ నుంచి జరుగుతున్న ఈ వివాదంపై పోలీసులు ఇప్పటివరకు ఛార్జ్షీట్ నమోదు చేయకపోవడాన్ని ఖండించారు.
విష్ణుపై తీవ్ర ఆరోపణలు
మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 1న తన కూతురు పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్ వెళ్లిన సమయంలో విష్ణు పక్కా ప్లాన్ కొద్దీ చేశాడని ఆరోపించారు. తెల్లవారుజామున విష్ణు అనుచరులు వచ్చి కారు తీసుకెళ్లడమే కాకుండా, తన సెక్యూరిటీపై దాడి చేసినట్లు వివరించారు. పోలీసులకు దీన్ని తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం – సీఎం రేవంత్కు మనోజ్ విజ్ఞప్తి
ఇటీవల కమిషనర్ ఇచ్చిన బైండోవర్ను కూడా విష్ణు అనుచరులు ఉల్లంఘిస్తున్నారని, కోర్టు నోటీసులు ఉన్నా తనను ఇంట్లోకి అనుమతించకుండా పోలీసులు ఆపడం దారుణమన్నారు. “ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్లాలంటే మోహన్బాబు అనుమతి కావాలంటున్నారు. ఇది ఎంతవెరైటీగా మారిందో మీరు చూడండి,” అని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించాలని, తన సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.