“రాహుల్ గాంధీ జీ… దయచేసి తెలంగాణలో మా అడవులను నరికివేయడం ఆపండి” అనే వాక్యంతో ఢిల్లీలో పలుచోట్ల హోర్డింగ్లు వెలిశాయి. జింక కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించే బొమ్మతో రూపొందించిన ఈ హోర్డింగ్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ హోర్డింగ్లను బీజేపీ నేత తజిందర్ బగ్గా ఏర్పాటు చేయడం ద్వారా ఇది రాజకీయ రీతిలోనూ చర్చనీయాంశమైంది.
గచ్చిబౌలిలో భూవివాదం
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలో ఉన్న సుమారు 400 ఎకరాల HCU భూమిని ప్రభుత్వం అభివృద్ధి పేరుతో విక్రయించేందుకు చదును పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతం ఎన్విరాన్మెంట్గా ఎంతో కీలకమైనదిగా పరిగణించబడుతోంది. అయితే అక్కడ ఉన్న చెట్లు తొలగించడం వల్ల ప్రాణుల నివాసానికి ప్రమాదం ఏర్పడిందని పలువురు ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

వన్యప్రాణుల మనుగడపై ముప్పు
ఈ భూముల చుట్టూ వందలాది జింకలు, పక్షులు, మరెన్నో వన్యజీవులు నివసిస్తున్నాయి. చెట్లు తొలగించడంతో వాటి జీవనశైలి దెబ్బతిన్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. అడవి ప్రదేశాలను చేను చేయడం వల్ల జంతువులకు మిగిలే ప్రదేశం లేదు. జింకలు నివాస ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని వారు చెబుతున్నారు.
పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలి
ఈ పరిణామాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అవసరమే అయినా, పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగించకుండా ముందుకెళ్లాలి. వన్యప్రాణులకు హాని కలిగించే పనులను పునఃపరిశీలించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ భూముల విషయంలో పారదర్శకత పాటించి, సమగ్ర దర్యాప్తుతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.