हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

HCU ఘటనపై మాదాపూర్ డీసీపీ అధికారిక ప్రకటన

Sudheer
HCU ఘటనపై మాదాపూర్ డీసీపీ అధికారిక ప్రకటన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద చోటుచేసుకున్న ఘటనపై మాదాపూర్ డీసీపీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొందరు విద్యార్థులు పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆరోపించినప్పటికీ, అటువంటిదేదీ జరగలేదని వారు స్పష్టం చేశారు. విద్యార్థులను కొందరు బయటి వ్యక్తులు ప్రేరేపించి నిరసనలు మరింత ఉద్రిక్తతకు దారితీసేలా చేశారని పోలీసుల వర్గాలు వెల్లడించాయి.

కంచ గచ్చిబౌలిలో ఉద్రిక్తతలు

డీసీపీ ప్రకటన ప్రకారం, నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు కంచ గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా కొందరు బయటి వ్యక్తులు అక్కడికి చేరుకుని హంగామా సృష్టించారు. ప్రభుత్వ అధికారులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

53 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీసులు మొత్తం 53 మందిని అదుపులోకి తీసుకుని, వారిని పర్సనల్ బాండ్‌పై విడుదల చేశారు. అయితే, సంఘటనకు ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న రోహిత్, నవీన్ కుమార్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిరసనలతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని, బయటివారు విద్యార్థులను రెచ్చగొట్టవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

శాంతి భద్రతల కోసం కఠిన చర్యలు

యూనివర్సిటీ పరిసరాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ప్రశాంతంగా ప్రదర్శనలు ఇచ్చుకోవచ్చని, కానీ చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించబోమని మాదాపూర్ డీసీపీ పేర్కొన్నారు. యూనివర్సిటీలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870