మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు

Kakani Govardhan Reddy: మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు!

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు. నగరంలోని ఆయన 3 ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.

Advertisements
మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు

ఏప్రిల్‌ 1న హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు

అక్రమ మైనింగ్‌, రవాణాకు పాల్పడ్డారంటూ పొదలకూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో సోమవారం విచారణకు ఆయన రాకపోవడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఏప్రిల్‌ 1న హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆదివారం నెల్లూరులోని ఇళ్లలోనూ కాకాణి ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడి ఇంటి గోడకు నోటీసులు అంటించారు.

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణ

కాగా, ఈ కేసులో కాకాణిని విచారించేందుకు నెల్లూరు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇస్తున్నారు. నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ ఎవరూ లేకపోవడం, వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Related Posts
జిల్లాల కుదింపు పై మంత్రి పొంగులేటి
Minister Ponguleti Clarity on district compression

హైదరాబాద్‌: జిల్లాల కుదింపుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ…కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లాని తీసేయాలని కాని కొత్త జిల్లాలు Read more

నూతన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్
Gyanesh Kumar as the new Election Commissioner

నేటితో ముగియనున్న ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా నియమితులయ్యారు. Read more

Telangana : 6729 మంది ఉద్యోగులను తొలగించిన రేవంత్ రెడ్డి సర్కార్ ?
Revanth Reddy government dismissed 6729 employees?

Telangana : ఒకే ఆర్డర్ తో 6,729 మంది పైన రేవంత్ సర్కార్ వేటు వేసింది. ప్రభుత్వంలో పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న పదవీ Read more

Revanth Reddy : రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్
Revanth Reddy రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా అడవిని ధ్వంసం చేస్తున్నారు కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా కంచ గచ్చిబౌలి అడవుల నిర్మూలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యలు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×