हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Revanthreddy: ప్రజలు మెచ్చే విధంగా సీఎం రేవంత్ పాలన :సంతోష్‌కుమార్‌ శాస్త్రి

Sharanya
Revanthreddy: ప్రజలు మెచ్చే విధంగా సీఎం రేవంత్ పాలన :సంతోష్‌కుమార్‌ శాస్త్రి

తెలుగు పండుగలలో ముఖ్యమైనది ఉగాది. ప్రతి ఉగాది పర్వదినాన పండితులు పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్ గురించి వివరణ ఇస్తారు. ఈసారి కూడా తెలంగాణలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి భవిష్యత్తు ఫలితాలను వివరించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంటుందంటే?

పాలన ప్రజలకు అనుకూలంగా సాగుతుంది – ప్రజలకు నచ్చే విధంగా సీఎం పాలన సాగిస్తారని పండితులు అభిప్రాయపడ్డారు. అధికారపక్షం-విపక్షం పోటీ తీవ్రతరం – పాలకుల మధ్య తీవ్ర పోటీ పెరుగుతుందని, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత పరిస్థితులు తలెత్తే అవకాశముందని అంచనా వేశారు. విద్య, వైద్యం, సంక్షేమం పై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టబోతోంది. విదేశీ పెట్టుబడులు – తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని విశ్లేషించారు. ఆర్థిక పరిస్థితి – రాష్ట్ర ఖజానాపై భారం పెరుగుతుందని, కానీ ప్రజలకు డబ్బు బాగానే ప్రసారం అవుతుందని తెలిపారు. లంగాణలో ఈ ఏడాది మోడరేట్ నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. సాగు కోసం నీటి కొరత ఉండదని, పంటలు సమృద్ధిగా పండుతాయని పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. ఎర్రరేగడి భూముల్లో ధాన్యం, మిర్చి, పత్తి పంటలు విపరీతంగా పండుతాయి. కృష్ణా, గోదావరి జలాల వినియోగం పరంగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు రావొచ్చని, వాటిని పాలకులు సమర్థంగా పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాలకుల భవిష్యత్తు, రియల్ ఎస్టేట్ రంగం, వైద్యం, విద్య వంటి అంశాలపై పండితులు విశ్లేషణ చేశారు. ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ముఖ్యంగా వర్షాకాలంలో తుపాన్లు విపరీతంగా ప్రభావం చూపవచ్చని చెప్పారు. నిరంతరం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని సామాజిక సమస్యలు, నిరసనలు చోటుచేసుకునే అవకాశముందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం రంగాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతాయి. రైతులకు అనుకూల వాతావరణం, అధిక దిగుబడులు ఉంటాయి. జలవివాదాల వల్ల పొరుగు రాష్ట్రాలతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, కానీ కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. తుపాన్లు, భూకంపాల ప్రభావం ఉండొచ్చు, కానీ సమర్థంగా పరిష్కరించబడతాయి. ఈ విధంగా ఉగాది పంచాంగ శ్రవణంలో రాష్ట్ర భవిష్యత్తుపై ఆసక్తికర విశ్లేషణలు చేశారు. రాష్ట్రాభివృద్ధి, పాలకుల తీరు, వర్షపాతం, రైతుల పరిస్థితి వంటి అంశాలపై పండితులు వెల్లడించిన విషయాలు ప్రజలకు ఉత్సాహాన్ని కలిగించాయి. పాలకులు ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తారని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని పంచాగ శ్రవణంలో వెల్లడించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870