Dating App Scam : తోడు కోసం మోజు పడితే 6.5 కోట్లు తోడేసారు ఉత్తరప్రదేశ్లోని నొయిడా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి డేటింగ్ యాప్ మోసానికి గురయ్యారు. ముంబైకి చెందిన ఓ మహిళ మాటలు నమ్మి ఏకంగా రూ.6.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ట్రేడింగ్లో లాభాల పేరుతో ఆ మహిళ అతనిని ఉచ్చులో పడేసింది.నొయిడాకు చెందిన దల్జీత్ సింగ్ ఢిల్లీలోని ఓ కంపెనీ డైరెక్టర్. భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, అతను ఓ డేటింగ్ యాప్లో అనిత అనే మహిళను కలిశాడు. కాలానుగుణంగా, వారి పరిచయం స్నేహంగా మారింది. అనిత మాటలు నమ్మిన దల్జీత్, తన భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలని భావించాడు.అనిత అతనికి ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే వేగంగా డబ్బు సంపాదించొచ్చని సూచించింది. ఆమె చెప్పిన మూడు వెబ్సైట్లలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని భరోసా ఇచ్చింది. దల్జీత్ తొలుత రూ.3.2 లక్షలు పెట్టాడు. కొన్ని గంటల్లోనే రూ.24 వేలు లాభం రావడంతో మరింత నమ్మకం పెరిగింది.ముందుగా వచ్చిన లాభంతో మరింత ఆశపడ్డ దల్జీత్, తన సేవింగ్స్లోని రూ.4.5 కోట్లు, అదనంగా రూ.2 కోట్లు అప్పుగా తెచ్చి మొత్తం రూ.6.5 కోట్లను పెట్టుబడిగా పెట్టాడు. కానీ అతను డబ్బు పెట్టిన వెంటనే మూడు వెబ్సైట్లు డౌన్ అయ్యాయి.

అనిత కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.తాను మోసపోయానని గ్రహించిన దల్జీత్, వెంటనే నొయిడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఇలాంటి ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా డేటింగ్ యాప్ల ద్వారా నమ్మించి భారీ మొత్తాల్లో మోసగించడం అనేక దేశాల్లో జరుగుతోంది. పోలీసుల సూచన ప్రకారం, ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసే ముందు పూర్తిగా పరిశీలించడం చాలా అవసరం.