हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్

Divya Vani M
Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్

Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్ తిరుపతిలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేసి, భారీగా డబ్బు డిమాండ్ చేశారు. వారి కుట్రను భగ్నం చేసేందుకు రాజేష్ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం హృదయ విదారకంగా మారింది.శుక్రవారం సాయంత్రం తిరుపతి జీవకోన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేష్ కుటుంబ సభ్యులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అంతటితో ఆగకుండా కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. మిగతా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి రాజేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు.చిత్తూరులో ఉన్న బంధువుల దగ్గరికి వెళ్లి డబ్బు తెస్తానని రాజేష్ నమ్మబలికాడు. దుండగులు అంగీకరించడంతో, అతనిని కూడా వెంట తీసుకెళ్లారు. అయితే, ప్రయాణం మద్యలో ఐతే పల్లె వద్ద కారులో నుంచి రాజేష్ బలవంతంగా దూకేశాడు. ఈ ఘటనతో తీవ్ర గాయాలపాలైన రాజేష్ అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు.బహిరంగ రహదారిపై గాయాలతో ఉండగానే, అక్కడి స్థానికులు అతన్ని గమనించారు.

Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్
Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్

వెంటనే 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.తక్షణమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజేష్‌ను ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులను దుండగులు కిడ్నాప్ చేశారని, తాను తప్పించుకున్నానని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.గాయాలు తీవ్రంగా ఉండటంతో పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రాజేష్‌ను తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. “నా భార్య, పిల్లలను కాపాడండి” అంటూ వేడుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన కుటుంబ సభ్యుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు వెలుగు చూడనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870