हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై అధికార ప్రకటన

Sharanya
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై అధికార ప్రకటన

ఉగాది పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త వచ్చింది. 2025 మార్చి 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, కేంద్ర ఉద్యోగుల కరువు భత్యం (DA)ను 2% పెంచేందుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయం కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగించనుంది. పెంపుదల తర్వాత కరువు భత్యం 53% నుంచి 55%కి చేరుకుంది. ఇది ఉద్యోగుల జీతాల్లో స్వల్ప మార్పును తీసుకురానుంది.

కేంద్ర ప్రభుత్వం ఏడు నెలల తర్వాత ఈ సారి DA పెంపుదల అమలు చేసింది. గతంలో 2024 జూలైలో కేంద్రం కరువు భత్యాన్ని 50% నుంచి 53%కి పెంచింది. అదే విధంగా 2023 జనవరిలో 46% నుంచి 50%కి పెరిగింది. అయితే గత కొన్ని పెంపుల మాదిరిగా ఈసారి పెంపుదల 3% లేదా 4% కాకుండా 2% మాత్రమే ఉండడం గమనార్హం.

DA పెంపుతో ఉద్యోగుల వేతనాల్లో మార్పులు

కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచిన తర్వాత, ఉద్యోగుల జీతాల్లో మార్పు ఎలా ఉంటుందో చూద్దాం ఈ క్రమంలో ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై వారి వేతనంలో మార్పులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ వేతనాల్లో ఎలా మార్పులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం. రూ.50,000 జీతం ఉన్న వారికి 53% డీఏతో రూ.26,500 కరవు భత్యం లభిస్తుంది. 55% డీఏతో రూ. 27,500కి చేరుతుంది. అంటే రూ. 1,000 పెరుగుతుంది. రూ. 70,000 వేతనం ఉన్న వారికి 53% డీఏతో రూ. 37,100 కరవు భత్యం లభించగా, 55% డీఏతో రూ. 38,500 రానుంది. ఈ మార్పుతో రూ. 1,400 పెరుగుతుంది.

78 నెలల తర్వాత 2% పెంపు

గత 6.6 సంవత్సరాలుగా ప్రతి DA పెంపు 3% లేదా 4% ఉండేది. కానీ ఈసారి 2% మాత్రమే పెరగడం చాలా అరుదైన సంఘటన. 2018లో చివరిసారి 2% పెంచిన తర్వాత, ప్రతి పెంపు 3% లేదా 4%గా ఉండేది. DA పెంపుదల జీతాలపై గణనీయమైన మార్పును తీసుకురాలేకపోయినా, ఇది ఉద్యోగుల దినసరి ఖర్చులకు కొంత ఊరట కలిగించే అంశం. కేంద్ర ప్రభుత్వం జనవరి 2025 నుండి పెంపు అమలులోకి తెచ్చినా, మంత్రివర్గ ఆమోదం మాత్రం మార్చి 28న లభించింది. అందువల్ల జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల DA బకాయిలు ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతంతో పాటు చెల్లించనున్నారు. రువు భత్యం (DA) పెంపు ద్వారా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు – మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులకు DA పెంపు ప్రయోజనం అందుతుంది. కేంద్ర పెన్షనర్లు – సుమారు 65 లక్షల మంది పెన్షనర్లకు పెరిగిన DA ద్వారా జీవన వ్యయానికి కొంత ఊరట లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు – DA పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించనప్పటికీ, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అనుసరించి తమ ఉద్యోగుల DA కూడా పెంచే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ప్రాణం మీదికి తెచ్చిన దగ్గు మందు

ప్రాణం మీదికి తెచ్చిన దగ్గు మందు

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

📢 For Advertisement Booking: 98481 12870