हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Iftar Dinner విజయవాడలో ఇఫ్తార్ విందు… హాజరైన సీఎం చంద్రబాబు

Sudheer
Iftar Dinner విజయవాడలో ఇఫ్తార్ విందు… హాజరైన సీఎం చంద్రబాబు

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం విజయవాడలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు.

ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల సాధించేలా అన్ని విధాలుగా సహాయపడతామని భరోసా ఇచ్చారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.

chandrababu attends iftar
chandrababu attends iftar

వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ

ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీ సమాజానికి చెందిన సమస్త వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. గత పాలకుల కాలంలో వక్ఫ్ ఆస్తులు దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పేదల కోసం ‘పీ4’ అమలు

పేదల అభివృద్ధే తన ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. పేదవారిని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావడమే తన జీవన ఆశయమని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 30న ‘పీ4’ అమలు ప్రారంభించనున్నామని చెప్పారు. ముస్లింల అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870