Once again, a plane flies over Srivari Temple.. TTD is angry!

Tirumala: మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. టీటీడీ ఆగ్రహం !

Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. అయినా తమ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన సంస్థ పట్టించుకోవటం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.

Advertisements

గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపంపై నుంచే విమానం

అయితే, ఆగమశాస్త్ర నిభందనల ప్రకారం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమాన రాకపోకలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం టీటీడీ అధికారులు కోరారు. ఇవాళ కూడా శ్రీవారి ఆలయ గోపురంపై నుంచే విమానం వెళ్లింది. గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపంపై నుంచే విమానం వెళ్లింది. దీంతో విమానయాన శాఖ వైఖరిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర పౌర విమానయాన మంత్రి తిరుమలను నో-ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి

ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా

కూటమిలో చంద్రబాబు ఉన్నప్పటికీ దీనిపై గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని కొంత మంది భక్తులు నిలదీస్తున్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. కాగా, హోంమంత్రి అనిత ఈ అంశంపై స్పందించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశం వచ్చిందని దీనిపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. నివేదికలు వచ్చిన వెంటనే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి శ్రీవారి ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు జరుగకుండా చూస్తామని తెలిపారు.

Related Posts
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
CM Revanth unveiled the sta

తెలంగాణ ముఖ్యమంత్రి కే. రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం హైదరాబాదులోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన Read more

అత్యంత సురక్షితమైన కారుగా స్కోడా కైలాక్
Unparalleled Safety The Skoda Kyoc has received a 5 star rating in the Bharat NCAP crash test

· భారత్ NCAP పరీక్షలో పాల్గొన్న మొదటి స్కోడా వాహనం కైలాక్.· ప్రయాణిస్తున్న పెద్దలు, పిల్లల రక్షణకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది.· ప్రయాణికుల Read more

sunitha williams: సునీతా విలియమ్స్‌కు డాల్ఫిన్ల స్వాగతం
సునీతా విలియమ్స్‌కు డాల్ఫిన్ల స్వాగతం

భూమికి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంభారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ చివరకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు బుచ్ Read more

న్యూజిలాండ్ ఎంపీ హాన-రావితి మైపీ-క్లార్క్, “హాకా” నిరసనతో చర్చల్లో ..?
Hana Rawhiti

న్యూజిలాండ్‌కు చెందిన 22 ఏళ్ల యువ ఎంపీ హాన-రావితి మైపీ-క్లార్క్, ఒక వివాదాస్పద బిల్లుపై తన నిరసన వ్యక్తం చేయడంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ యువ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×