हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Sharanya
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కేవలం కలగానే మిగిలిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన హయాంను కొనసాగిస్తుందని, వందకు వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకోవడం ఇక అసాధ్యమని, అది కేవలం కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు.

Komat 2 jpg

ఒకవేళ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాలు విసిరారు. ఈ సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించగలరా? అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కోమటిరెడ్డి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తే, కేసీఆర్ కుటుంబానికి జైలు తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇప్పుడు దీనిపై మరింత స్పష్టత రావడం రాజకీయంగా కొత్త మలుపుని తీసుకొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఆ గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మిగిలిన ఒక గ్యారంటీ కూడా త్వరలోనే అమలు చేస్తామని, ఎన్నికల హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజల మనసు గెలుచుకుంటోందని, అందువల్లనే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నిత్యం జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం రేపే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870