KTR meets former Governor Narasimhan in Chennai

KTR : చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను కలిసిన కేటీఆర్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు. చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు.ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు.

చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను

రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా

కాగా, కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. మాజీ గవర్నర్ కృష్ణకాంత్‌ను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్‌గా నరసింహన్ నిలిచారు.

దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుంది

కాగా, చెన్నైలో నిర్వ‌హించిన డీలిమిటేష‌న్ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొని.. డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని అద్భుతంగా తెలియచెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాల‌న్నారు.

Related Posts
రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు మంచి పద్ధతి కాదు: సుప్రీంకోర్టు
Freebies announced by political parties not a good practice: Supreme Court

ఉచితాలు ఇస్తుండటంతో ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించే విధానం సరైనదికాదని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. Read more

ఇంజెక్షన్ తో రొమ్ము క్యాన్సర్ చికిత్స
ఇంజెక్షన్ తో రొమ్ము క్యాన్సర్ చికిత్స

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి మరియు బోస్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతాకు చెందిన శాస్త్రవేత్తల బృందం రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స కోసం అధునాతన ఇంజెక్షన్ హైడ్రోజెల్‌ను Read more

చైతు – శోభిత ల స్నేహం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో తెలుసా..?
nagachaitnya shobitha

నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహం రీసెంట్ గా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో Read more

Tamil Nadu Chief Annamalai : విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు
Tamil Nadu Chief Annamalai విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు

Tamil Nadu Chief Annamalai : విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు ఇదిగో, నూతన రాజకీయ నాయకుడు విజయ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఘాటైన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *