Every Saturday will now be 'No Bag Day' in AP

AP schools : ఏపీలో ఇకపై ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’

AP schools : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుస్తకాల మోతకు స్వస్తి పలికేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా మూడో శనివారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. అయితే ఇకపై ప్రతీ శనివారం కూడా నో బ్యాగ్ డే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్న నారా లోకేష్.. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలుచేస్తామని ప్రకటించారు. నో బ్యాగే డే అయిన శనివారం రోజున విద్యార్థులకు క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని ట్వీట్ చేశారు.

Advertisements
ఏపీలో ఇకపై ప్రతి శనివారం

విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యా శక్తి పేరుతో ఓ కార్యక్రమం అమలుచేస్తోంది. విద్యాశక్తి కింద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా ఆన్‌లైన్‌లో బోధన అందిస్తోంది. ఐఐటీ మద్రాస్‌ సహకారంతో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ చేపడుతోంది. తొలి విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో జూమ్ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.

Related Posts
ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain passed away

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. Read more

Inter Supply Exams: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారు
ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 సంవత్సరానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. విద్యార్థులకు అదనపు అవకాశం కల్పించడానికి సప్లిమెంటరీ పరీక్షలు Read more

ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF)..
india international trade fair

ప్రతీ సంవత్సరం, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF) ఒక విశాలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక ప్రదర్శనగా ప్రగ్యతి మైదాన్, ఢిల్లీ లో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం, Read more

21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×