Israel గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి

Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి

Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి తాజాగా గాజాలో హమాస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.హమాస్ సైనిక నిఘా విభాగానికి అధిపతిగా ఉన్న ఒసామా టబాష్ ను ఇజ్రాయెల్ తమ దాడుల్లో హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించింది.దక్షిణ గాజాలో జరిగిన ఈ ఆపరేషన్ లో అతను ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ధృవీకరించింది.అయితే దీనిపై ఇప్పటివరకు హమాస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Israel గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి
Israel గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి

ఒసామా టబాష్ ఎవరూ

హమాస్ లో కీలక నేతగా ఉన్న ఒసామా టబాష్, హమాస్ టార్గెటింగ్ యూనిట్ చీఫ్ గా పనిచేశాడు.అతని నేతృత్వంలో హమాస్ దళాలు ఇజ్రాయెల్ పై పలు దాడులు నిర్వహించాయి.హమాస్ వ్యూహాత్మకంగా చేపట్టే దాడులకు ప్రధాన సూత్రధారి ఆయనేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.ఇజ్రాయెల్, హమాస్ మధ్య మూడు రోజుల క్రితం సీజ్ఫైర్ ఒప్పందం ముగిసింది.అప్పటి నుంచి గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ముమ్మరంగా కొనసాగిస్తోంది.ఈ దాడులు హమాస్ లక్ష్యాలను కుదేలు చేయడానికేనని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ తామే అంగీకరించని కారణంగా దాడులు మళ్లీ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించిన హమాస్

హమాస్ తాము బందీలను విడుదల చేయడానికి నిరాకరించిందని,అందువల్లే దాడులు మళ్లీ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించిందని తెలుస్తోంది.తాజా దాడిలో 85 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా అధికారులు ప్రకటించారు.మరణించినవారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారని తెలుస్తోంది.అంతకుముందు జరిగిన దాడుల్లో 400 మందికి పైగా గాజా పౌరులు మరణించినట్లు సమాచారం. హమాస్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయా లేక మళ్లీ సీజ్ఫైర్ కు అవకాశం ఉందా? అన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.హమాస్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి.

Related Posts
ట్రంప్ వ్యాఖ్యలు నిజమే : వ్లాదిమిర్ పుతిన్
Trump comments are true: Vladimir Putin

మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగా Read more

మహిళా అత్యాచారం కేసులో బాధితురాలని అరెస్ట్ చేరిన పోలీసులు
ఘజియాబాద్‌లో షాక్.. మహిళా అత్యాచార కేసు మలుపు! బాధితురాలే జైలుకి

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ మహిళ తనపై సామూహిక లైంగికదాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విచారణలో ఆమె ఆరోపణలు Read more

కాకినాడ పోర్టు అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి పవన్ లేఖ
pawan kalyan visits kakinad

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ Read more

Bank holidays: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెల బ్యాంకు సెలవు ఇలా..
Bank holidays for the month of April for Telugu states

Bank holidays : ఏప్రిల్‌ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *