Richest MLA's: సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగువారు టాప్ లో

Richest MLA’s: సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగువారు

ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల ఓ విశ్లేషణను విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అత్యంత పేద ఎమ్మెల్యేలు ఎవరూ అనే వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలవగా, అతి పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. ఇందులో ఎక్కువ మంది తెలుగువారే ఉండడం విశేషం. మరి వీరు ఎవరెవరు? ఏపీ నుంచి ఎంత మంది? తెలంగాణ నుంచి ఎంత మంది? ఎవరి వద్ద ఎంత ఆస్తులున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

tk2g2lro richest poorest mlas 625x300 19 March 25

భారతదేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు

ADR విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలిచారు. ఆయన వద్ద రూ. 3400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా గుర్తింపు పొందారు. ఆయన ఆస్తుల మొత్తం విలువ కేవలం రూ. 1700 మాత్రమే కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో స్థానం దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా టాప్ 10లో ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చోటు దక్కించుకున్నారు.

టాప్-10లో ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు:

టాప్-5: ఎన్. చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, టీడీపీ) – రూ. 931 కోట్లు
టాప్-6: పి. నారాయణ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 824 కోట్లు
టాప్-7: వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ) – రూ. 757 కోట్లు
టాప్-8: వి. ప్రశాంతి రెడ్డి (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 716 కోట్లు

టాప్-20లో ఏపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు:

టాప్-12: నారా లోకేష్ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 542 కోట్లు
టాప్-16: ఎన్. బాలకృష్ణ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 295 కోట్లు
టాప్-18: లోకం నాగ మాధవి (జనసేన ఎమ్మెల్యే) – రూ. 291 కోట్లు

తెలంగాణ నుంచి అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు

టాప్-20 జాబితాలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా స్థానం దక్కించుకున్నారు.

టాప్-11: జీ. వివేకానంద (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 606 కోట్లు
టాప్-15: కే. రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 458 కోట్లు
టాప్-19: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 433 కోట్లు .ఈ నివేదిక రాజకీయ రంగంలో ఆర్థిక శక్తిని సూచించే విధంగా ఉంది. తెలుగురాష్ట్రాల నేతలు భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ఉండడం, అధిక సంఖ్యలో ధనిక ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందడం ఆసక్తికర విషయమే.

Related Posts
రెండు విడుతలుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు
parliament

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్‌ సమావేశాలు రెండు విడుతల్లో Read more

శ్వేతపత్రాలపై ఏం చేశారు…? అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
New law in AP soon: CM Chandrababu

అధికారంలోకి వచ్చి రాగానే చంద్రబాబు ..గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పత్రాల్లో అనేక అంశాలను ప్రస్తావించి వీటిపై Read more

అసలునిజం బయట పెట్టిన U.శ్రీనివాసరావు దీనికంతటికి కారణం ఒక అమ్మాయి – రాజమౌళి & యు.శ్రీనివాసరావు
SS రాజమౌళి వివాదం – అసలు ఏమి జరిగింది?

యు.శ్రీనివాసరావు రాసిన డెత్ లెటర్ వివరణ యు.శ్రీనివాసరావు. అనే నేను నాకు రాజమౌళికి 36 ఏళ్లుగా స్నేహం ఉంది , అందరి జీవతల్లాగా మా జీవితం లో Read more

పంచాయతీల్లో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష
pawan kalyan to participate in palle panduga in kankipadu

రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడకూడదని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *